close
Choose your channels

ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన మహేశ్!

Sunday, September 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన మహేశ్!

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మైగ్రేన్ తలనొప్పితో బాధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ వీరాభిమానులు, సినీ ప్రియులు షాక్‌కు గురయ్యారు. సుదీర్ఘకాలంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ‘అనేకమంది డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయింది. కానీ ఓ ప్రాచీన వైద్యవిధానంతో నన్ను వేధిస్తున్న బాధ నుంచి విముక్తుడిని అయ్యాను. మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న కాలంలో నా అర్ధాంగి నమ్రత ఓ స్నేహితురాలి ద్వారా డాక్టర్ సత్య సింధూజను కలిసింది. సింధూజ చక్రసిద్ధ నాడీ వైద్యంలో నిపుణురాలు. ఆమె అందించిన చికిత్సతో మైగ్రేన్ తలనొప్పి మటుమాయం అయింది. నాలా మైగ్రేన్‌తో బాధపడుతున్న వాళ్ల కోసమే ఈ విషయం వెల్లడిస్తున్నాను’ అని ఒకింత భావోద్వేగతంతో మహేశ్ చెప్పుకొచ్చారు.

నాకు బాధ్యత ఉంది!
అయితే ఇలాంటి వ్యాధి నుంచి బయటపడాలంటే ‘చక్రసిద్ధ నాడీ’ వైద్యం ఒక్కటే మార్గమని.. తాను కూడా ఇలానే ఉపశమనం పొందాను కాబట్టి నమ్మకం ఏర్పడిందన్నారు. తనకు సంబంధించిన ఎలాంటి విషయాలనైనా సరే అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉన్నాని.. అయితే ఈ విషయాన్ని మాత్రం చాలా గోప్యం ఉంచినట్లు సూపర్‌స్టార్ తెలిపారు. అయితే తన మాదిరే ఈ సమస్య చాలామందికి ఉంటుందని, వాళ్లందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత తనకుందన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.