close
Choose your channels

షాకయ్యా.. ఇది హేయకరమైన చర్య.. మహేశ్ ఎమోషనల్ ట్వీట్

Tuesday, April 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

షాకయ్యా.. ఇది హేయకరమైన చర్య.. మహేశ్ ఎమోషనల్ ట్వీట్

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లతో మారణహోమం తలపించింది!. ఈస్టర్‌ ఆదివారం రోజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు బాంబు దాడులకు పాల్పడ్డారు. మొత్తం ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా మృతి చెందగా.. అంతకు రెండు మూడు రెట్ల మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఈ భీకర ఘటనతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిని ప్రపంచదేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా ఉగ్రమూకలపై కన్నెర్రజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మహేశ్ ట్వీట్ సారాంశం..

"ఇది చాలా అసహ్య.. హేయకరమైన చర్య. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇలా జరిగిందని తెలుసుకుని షాకయ్యా. ఇది ఖచ్చితంగా పిరికిపందల చర్యే. ఇలాంటి కష్టతరమైన సమయంలో శ్రీలంక బ్లాస్ట్ బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కోసం ప్రార్థిద్దాం" అని మహేశ్ బాబు ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు అభిమానులు స్పందిస్తూ శ్రీలంక కోసం ప్రార్థిద్దాం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. మహేష్, పూజా హేగ్దే జంటగా నటించిన ‘మహర్షి’ చిత్రం మే9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.