మహేష్ సరికొత్త రికార్డ్...

  • IndiaGlitz, [Tuesday,April 19 2016]

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం బ్రహ్మోత్సవం. ఈ సినిమా మే 1న ఆడియో విడుదల జరుపుకోనుంది. సినిమాను మే 13 విడుదల చేయాలని అనుకుంటున్నారు కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా విడుదల మే 20 లేదా 27న కానీ ఉండవచ్చు.

అయితే సినిమా బిజినెస్ విషయంలో దూసుకెళుతుంది. లెటెస్ట్ గా ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీటీవీ వారు 20 కోట్ల రూపాయలను చెల్లించి చేజిక్కించుకున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే బాహుబలి తర్వాత ఆ రేంజ్ శాటిలైట్ హక్కులను దక్కించుకున్న చిత్రమిదే అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే మహేష్ ఓ రికార్డ్ ను క్రియేట్ చేసినట్టే అవుతుంది.

More News

యు.ఎస్. లో నారా రోహిత్ 'రాజా చెయ్యి వెస్తే' హల్ చల్

తన నటన,డైలాగ్ డెలివరీతో తొలి సినిమా బాణం సినిమా నుండి నేటి వరకు డిఫరెంట్ గా చేస్తూ తన ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటూ యూత్ లో,ప్యామిలీ ఆడియెన్స్ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం' రాజా చెయ్యివేస్తే'.

మరోసారి ఎన్టీఆర్ తో జగ్గూభాయ్

ఈ ఏడాది నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్ తో విలన్ గా ఢీ కొట్టిన జగ్గూ భాయ్ అలియాస్ జగపతిబాబు స్టైలిష్ విలన్ గా మంచి పేరుని సంపాదించుకున్నాడు.

మనం సినిమా మిస్ అయిన సూర్య

అక్కినేని కథానాయకులుతో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం మనం.ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచిన విషయం తెలిసిందే.

నిహారిక ఒక మనసు ఆడియో వేడుకకు అతిధులు వీళ్లే...

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఫస్ట్ టైమ్ మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక ఇండస్ట్రీకి పరిచయం అవుతుండడం విశేషం.

సరైనోడుకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు