మహేశ్‌ బాబుకి కరోనా పాజిటివ్.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్, కోలుకోవాలంటూ ఫ్యాన్స్ ట్వీట్లు

  • IndiaGlitz, [Friday,January 07 2022]

దేశంలో పరిస్థితులు మళ్లీ అదుపు తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా కరోనా, ఒమిక్రాన్ కేసులు ఊహకందని వేగంతో పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడుతున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వారికి పాజిటివ్‌గా తేలుతోంది. ఈ రోజు కోలీవుడ్‌కు చెందిన అరుణ్ విజయ్‌కి కరోనా సోకింది. ఆ తర్వాత కాసేటికే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సైతం వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా మహేష్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని.. స్వల్ప లక్షణాలతో హోమ్ ఇసో లేషన్ లో ఉన్నానని సూపర్‌స్టార్ మహేశ్ తెలిపారు. అలాగే గత కొద్దీరోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనాలని ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు. మరోవైపు మహేష్‌కు కరోనా అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సూపర్‌స్టార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అలాగే సీనియర్ నటుడు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా ఈరోజే కొవిడ్‌ బారిన పడ్డారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. బూచోడులాంటి కరోనా నుంచి రెండేళ్లుగా తప్పించుకున్నానని, చివరికి దాని బారిన పడ్డానని మంచు లక్ష్మీ వివరించారు. కొవిడ్‌ నుంచి త్వరగా బయటపడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని మంచు లక్ష్మీ కోరారు.

వైరస్‌తో పోరాడేందుకు మన వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని... మంచి ఆహారం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ తీసుకోవాలని.. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సార్లు కొవిడ్‌ టీకా తీసుకునుంటే బూస్టర్‌ డోసు తీసుకోవాలని మంచు లక్ష్మీ చెప్పారు. వినోదం కోసం మంచి సినిమాలు, కార్యక్రమాలు, పాడ్‌కాస్ట్‌ల వివరాలు చెప్పాలంటూ అభిమానులను కోరారు.

More News

కోలీవుడ్‌లో కరోనా కలకలం.. హీరో అరుణ్ విజయ్‌కు పాజిటివ్, ఆందోళనలో ఫ్యాన్స్

దేశంలో కరోనా కేసులు మరోసారి ఊహకందని వేగంతో పెరుగుతున్నాయి. గురువారం ఒక్కసారిగా 90 వేల కొత్త కేసులు నమోదవ్వగా..

చట్టానికి సహకరిస్తా.. నా కొడుకును దూరం పెడతా: ప్రజలకు ఎమ్మెల్యే వనమా బహిరంగ లేఖ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు ఆడపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

ఐదు భాషల్లో  21న "వర్మ'' (వీడు తేడా) ఆగమనం

నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రం "వర్మ'' (వీడు తేడా). ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్ ,సుపూర్ణ మలాకర్, సందడి చేస్తున్నారు.

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య.. ఎట్టకేలకు వనమా రాఘవ అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలుగు నాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

‘‘ నా భార్యను పంపమన్నాడు’’.. రామకృష్ణ సెల్ఫీ వీడియో , వనమా రాఘవకు బిగుస్తోన్న ఉచ్చు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య ఘటన కీలక మలుపు తిరిగింది.