close
Choose your channels

మ‌హేష్ బాబుకి స‌ర్జ‌రీ.. ‘‘సర్కార్ వారి పాట’’కి కొద్దిరోజుల పాటు బ్రేక్

Thursday, December 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్‌స్టార్ మహేశ్ బాబు సర్జరీ చేయించుకోనున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో .. మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే చిత్రీకరణ సమయంలో ఆయన మోకాలికి స్వల్పంగా గాయమైనట్లుగా తెలుస్తోంది. దీంతో మహేశ్ కొన్నాళ్లుగా నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకోవాలని మహేశ్ భావిస్తున్నారు. సర్జరీ జరిగితే ఆయన రెండు, మూడు నెలల పాటు ఇంటికే పరిమితం కావాల్సి వుంటుంది.

నిజానికి మహేశ్ బాబుకు ఏడేళ్ల నుంచి మోకాలికి సంబంధించిన సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. అయినప్పటికీ వరుస ప్రాజెక్ట్‌లతో విశ్రాంతి లేకుండా పాల్గొంటున్నారు. 2020లో సర్జరీ చేయించుకోవాలని భావించినా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నేపథ్యంలో వీలు పడలేదు. దానికి తోడు ఇప్పుడు షూటింగ్‌లో గాయం కావడంతో నొప్పి తీవ్రతరమయిందట. దీంతో సర్జరీ చేయించుకోక తప్పదనే నిర్ణయానికి మహేశ్ వచ్చినట్టు ఫిలింనగర్ టాక్.

మరోవైపు ట్విట్టర్‌లో #GETWELLSOONMAHESHBABU అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది. తమ అభిమాన హీరో మహేశ్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు. ఇకపోతే ‘‘సర్కార్ వారి పాట’’లో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా .. ‘‘ఆర్ఆర్ఆర్’’ వలన ఏప్రిల్‌కి మారింది. ఇప్పుడు మహేశ్ సర్జరీ నేపథ్యంలో ఆయన దాదాపు రెండు నెలల పాటు అందుబాటులో వుండరు. దీంతో సినిమా రిలీజ్‌పై ఏమైనా ప్రభావం పడుతుందా అన్న అనుమానాలు సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌ని వెంటాడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.