తనతో పాటు చిరంజీవిని తీసుకెళ‌తానంటున్న మ‌హేశ్‌

ఇప్పుడు హీరోల మ‌ధ్య ట్రెండ్ మారుతుంది. ఒక‌రికొక‌రు ప‌ర‌స్ప‌రం స‌హ‌కారం అందించుకుంటూ వ‌స్తున్నారు. స్నేహితుల్లాగా క‌లిసి పోతున్న ఈ హీరోల్లో మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ముందుంటున్నారు. ఒక‌రి సినిమాల‌ను మ‌రొక‌రు అభినందించుకోవ‌డ‌మే కాదు.. ఒక‌రి వేడుక‌ల‌కు మ‌రొక‌రు హాజ‌ర‌వుతున్నారు. కాగా మ‌హేశ్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌మ హీరోల మ‌ధ్య ఉండే అనుబంధం గురించి ఇన్‌డైరెక్ట‌ర్‌గా చెప్పిన ఓ విష‌యం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

వివ‌రాల్లోకెళ్తే.. మీ బ‌యోపిక్ చేస్తే మీ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తే బావుంటుంద‌ని అనుకుంటున్నార‌ని మ‌హేశ్‌ని ప్ర‌శ్నించారు. అయితే మ‌హేశ్ ఏమాత్రం త‌డుముకోకుండా నా బ‌యోపిక్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌దు. నాది సింపుల్‌, బోరింగ్ లైఫ్‌. పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాదు అని చెప్పేశాడు. అలాగే రోడ్ ట్రిప్‌కు వెళితే సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రితో వెళ‌తార‌ని అడిగితే ...రామ్‌చ‌ర‌ణ్‌, తారక్‌ల‌ను తీసుకెళ‌తాన‌ని, అలాగే బ్యాలెన్స్ చేయ‌డానికి చిరంజీవిగారిని తీసుకెళ‌తాన‌ని స‌మాధానం చెప్పారు. త‌న‌కు తండ్రి కృష్ణ న‌టించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన త‌ర్వాతే న‌టుడు కావాల‌నే ఆస‌క్తి పుట్టింద‌ని కూడా ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో హిట్ కొట్టిన మ‌హేశ్‌.. మే నెల‌లో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మాణంలో త‌న 27వ సినిమాను షురూ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.