మహేష్ మళ్లీ గ్రీన్ సిగ్నల్..
- IndiaGlitz, [Wednesday,May 22 2019]
సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం 'మహర్షి' మే 9న విడుదలై మంచి కలెక్షన్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సినిమా మేకింగ్ విషయంలో మహేష్ చాలా హ్యాపీగా ఉన్నాడట. దర్శకుడు వంశీ పైడిపల్లి అంటే మహేష్కి ప్రత్యేకమైన అభిమానం కూడా ఏర్పడింది. కాబట్టి మహేష్ తన 27వ సినిమాను వంశీ పైడిపల్లితోనే చేయాలనుకుంటున్నాడని టాక్.
అయితే ఈ సినిమా 2020 ద్వితీయార్థంలో ఉండొచ్చునని టాక్. ప్రస్తుతం మహేష్ తన 26వ సినిమాను అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలవుతుది. దీని తర్వాతే మహేష్ 27వ సినిమా గురించి ఫుల్ ఫోకస్ పెడతాడు. ఈలోపు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ను తయారు చేసుకునే పనిలో ఉంటాడు.