close
Choose your channels

మ‌హేష్ మూవీ అప్‌డేట్‌

Monday, February 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన తాజా షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పోరాట సన్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు.

మార్చి 8కి పూర్త‌య్యే ఈ షెడ్యూల్‌తో ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక మిగిలివున్న పాటను మహేష్, కైరా అద్వానీపై చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ మిన‌హా ప్యాచ్ వ‌ర్క్ అంత‌టినీ మార్చి 27కంతా పూర్తి చేస్తార‌ట‌. మ‌రో వైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

'శ్రీమంతుడు' సినిమా తర్వాత మహేష్, కొరటాల కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. త‌మిళ న‌టుడు శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.