నాగ్ డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన మహేష్

  • IndiaGlitz, [Tuesday,July 26 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ కాంబినేష‌న్లో ఊపిరి చిత్రాన్ని తెర‌కెక్కించి వంశీ పైడిప‌ల్లి విజ‌యం సాధించాడు.విజ‌యంతో పాటు విమ‌ర్శ‌కుల ప్రసంశ‌లు కూడా ద‌క్కించుకున్నాడు. ఊపిరి సినిమా టైమ్ లో నాగార్జున వంశీ పైడిప‌ల్లిని అఖిల్ కోసం క‌థ రెడీ చేయ‌మ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.
అయితే... అఖిల్ బాలీవుడ్ రీమేక్ చేద్దాం అన‌డం..వంశీ పైడిప‌ల్లి దానికి నో చెప్ప‌డంతో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఆత‌ర్వాత వంశీ పైడిప‌ల్లి మ‌హేష్ తో మూవీ చేయ‌డానికి ప్లాన్ చేసారు. దీనికి కార‌ణం..బ్ర‌హ్మోత్స‌వం ప్లాప్ అవ్వ‌డంతో మ‌హేష్ పి.వి.పి సంస్థ‌కు మ‌రో సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చార‌ట‌. దీంతో పి.వి.పి మ‌హేష్ తో చేయ‌నున్న సినిమాకి డైరెక్ట‌ర్ గా వంశీ పైడిప‌ల్లిని ఫిక్స్ చేయ‌డం..వంశీ మ‌హేష్ కి క‌థ చెప్ప‌డం జ‌రిగింద‌ట‌. ఇక మ‌హేష్ - వంశీ కాంబినేష‌న్ లో మూవీ క‌న్ ఫ‌ర్మ్. మురుగుదాస్ మూవీ త‌ర్వాత మ‌హేష్ వంశీతోనే సినిమా చేస్తారు అనుకున్నారు. అయితే..ఏమైందో ఏమో కానీ..మ‌హేష్ వంశీకి షాక్ ఇచ్చి కొర‌టాల శివ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో అటు అఖిల్ - ఇటు మ‌హేష్ తో అనుకున్న‌ రెండు ప్రాజెక్ట్స్ సెట్ కాక‌పోవ‌డంతో తెగ టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట. మ‌రి...వంశీ మ‌హేష్ కోసం వెయిట్ చేస్తాడో..లేక‌పోతే వేరే హీరోతో సినిమా చేస్తాడో చూడాలి.

More News

శ్రీరస్తు - శుభమస్తు ధియేట్రికల్ ట్రైలర్ రివ్యూ

అల్లు శిరీష్-లావణ్య త్రిపాఠి జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్నినిర్మించారు.

తండ్రి పుట్టిన‌రోజున కొడుకు మూవీ టీజ‌ర్ రిలీజ్..

తండ్రి పుట్టిన‌రోజున కొడుకు మూవీ టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. ఇంత‌కీ...ఆ తండ్రి కొడుకులు ఎవ‌ర‌నుకుంటున్నారా..? సాయికుమార్ - ఆది. వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆది న‌టించిన చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో సాయికుమార్ కీల‌క‌పాత్ర పోషించారు.

విజయవాడ లో 'పెళ్ళి చూపులు' స్పెషల్ ప్రీమియర్ షోకు మంచి స్పందన

విజయ్ దేవరకొండ,రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి(ధర్మపథ క్రియేషన్స్),

'ఇంకొక్కడు' తెలుగు హక్కులను దక్కించుకున్న

చియాన్ విక్రమ్ హీరోగా నయనతార,నిత్యామీనన్ హీరోయిన్స్ గా థమీన్స్ ఫిలింస్ బ్యానర్స్ పై

'శభాష్ నాయుడు' కు ఎందుకిన్ని అడ్డంకులు....

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్,రమ్యకృష్ణ,శృతిహాసన్ లు ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం శభాష్ నాయుడు.