నేను మాస్క్ ధరించా.. మరి మీరు..? : మహేశ్

  • IndiaGlitz, [Friday,May 22 2020]

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇండియాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం.. వ్యాక్సిన్ ఎప్పుడు రెడీ అవుతుందో తెలియకపోవడంతో జనాలు బిక్కిబిక్కి మంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే లాక్ డౌన్ ఉన్నప్పటికీ దేశంలో చాలా వరకూ సడలింపులు ఇచ్చేయడంతో ఎక్కడ జన జాతరే ఉంది. ఈ తరుణంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ‘మాస్క్ తప్పకుండా వాడండి.. నేను వాడుతున్నా.. మరి మీరు’ అని చెబుతూ అభిమానులు, ప్రజలను ఉద్ధేశించి పలు కీలక సూచనలు చేశాడు.

ఇలాంటి టైమ్‌లో మాస్క్ మస్ట్!

‘కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ సడలింపులతో క్రమంగా అన్నీ తెరుచుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో మాస్కులు తప్పనిసరి. బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కులు ధరించండి. దీనివల్ల మనతో పాటు ఇతరులను రక్షిస్తున్న వారమవుతాం. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీవితం మళ్లీ సాధారణ పరిస్థితులకు వెళ్తోంది. ఇటువంటి సమయంలో మాస్కులు ధరించడం చాలా మంచిది. నేను మాస్కు ధరించాను.. మరి మీరు?’ అని మహేశ్‌ బాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ఇందుకు పలువురు అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ తప్పకుండా.. సార్ మేము మాస్క్‌లు వాడుతున్నాం.. వాడతాం కూడా అని కామెంట్స్ చేస్తున్నారు.

More News

నిశ్చితార్థంపై రానా-నాని మధ్య చాటింగ్.. క్లారిటీ

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ ప్రేమించి.. పెద్దలను ఒప్పించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.

ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ పదే పదే పిలిచే రాహుల్ ఈయనే..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే చాలు ఎక్కువగా వినపడే పేరు రాహుల్.. రాహుల్..? ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ రాహుల్ క్వశ్చన్ వేయకుండా ఉండరు..?

ఆర్బీఐ ప్రకటనతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కరోనా కష్టకాలంలో ఆర్బీఐ పలు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంకుల నుంచి లోన్లు

మరో 3 నెలలు ఈఎంఐ లోన్లు కట్టక్కర్లేదు.. ఆర్బీఐ కీలక ప్రకటన

కరోనా కష్టకాలంలో ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ తాజాగా మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా కష్టకాలంలో ఆర్బీఐ మరో శుభవార్త

కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. లాక్ డౌన్‌తో ఎలాంటి ఆదాయం లేక జనాలు ఇబ్బందులు పడుతున్న కష్టకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తియ్యటి శుభవార్త చెప్పింది.