'మేజర్ చంద్రకాంత్’కి 25 ఏళ్ళు

  • IndiaGlitz, [Monday,April 23 2018]

మహానటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు కెరీర్‌లో  ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ‘మేజర్ చంద్రకాంత్’ ఒకటి. ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తొలిసారిగా ‘అడవి రాముడు’ (1977) సినిమాని తెరకెక్కించి సంచ‌ల‌న విజ‌యం అందుకున్న‌ కె.రాఘవేంద్రరావు.. ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వ‌చ్చిన 12వ సినిమా ఇది. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన 12 చిత్రాల్లో  ఏడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయంటే..

ఈ కాంబినేషన్‌కి ప్రేక్ష‌కుల్లో ఎంత క్రేజ్ ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. త‌మ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి, ఆఖ‌రి చిత్రాలు ఘ‌న‌విజ‌యాలు సాధించ‌డం అనేది అపూర్వ‌మైన అంశంగా చెప్పుకోవ‌చ్చు. ఎన్టీఆర్ కెరీర్‌లో చివ‌రి హిట్‌గా నిలిచిన ఈ సినిమాని శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై క‌లెక్ష‌న్ కింగ్‌ మోహన్ బాబు నిర్మించారు. మోహన్ బాబు సంస్థ‌లో ఎన్టీఆర్ నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ సినిమాకి తొలిసారి స్వరాలను అందించిన కీరవాణి.. తన సంగీతంతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్ళారు. ఇందులోని పాట‌ల‌న్నీ అప్ప‌ట్లో పెద్ద హిట్‌. ముఖ్యంగా.. జాలాది కలం నుంచి జాలువారిన దేశభక్తి గీతం “పుణ్యభూమి నా దేశం” అయితే ఎవ‌ర్‌గ్రీన్‌గా నిలిచింది.

ఈ పాట‌లో ఎన్టీఆర్ అభినయానికి బాలు గాత్రం తోడ‌వ‌డంతో.. పాట చిర‌స్థాయిగా నిలిచిపోయింది. కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్, దేశభక్తి, కుటుంబ విలువ‌లు.. ఇలా అన్ని అంశాల‌ను స‌మ‌పాళ్ల‌లో రంగరించి ఈ సినిమాని ప‌దికాలాల పాటు గుర్తుండిపోయేలా రూపొందించారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. 1993 ఏప్రిల్ 23న‌ విడుదలైన ఈ చిత్రం.. నేటితో 25 సంవత్సరాలను పూర్తిచేసుకుంటోంది.

More News

ఆ విష‌యంలో మ‌హేశ్‌దే రికార్డు

భ‌ర‌త్ అనే నేను.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ మూవీ పేరిది.

ముచ్చ‌ట‌గా మూడోసారి..

యూత్‌ఫుల్ మూవీస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌ర్శ‌కుడు మారుతి. ఈ రోజుల్లో నుంచి మ‌హానుభావుడు వ‌ర‌కు యువ‌త‌నే ల‌క్ష్యంగా చేసుకుని ఆయ‌న రూపొందించిన చిత్రాల‌న్నీ మంచి ఆద‌ర‌ణ పొందాయి.

బ్లాక్‌బ‌స్ట‌ర్ హ్యాట్రిక్ కొట్టిన దేవిశ్రీ ప్ర‌సాద్‌

దేవిశ్రీ ప్ర‌సాద్‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.

'అర్జున్ రెడ్డి' సీక్వెల్ గురించి విజయ్

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’.

'క‌ణం' సినిమాతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాను - సాయిప‌ల్ల‌వి

నాగశౌర్య, సాయిపల్లవి నటించిన చిత్రం ‘కణం’. ఎన్.వి.ఆర్ సినిమా  స‌మ‌ర్ప‌ణ‌లో లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది.