సుమంత్ అశ్విన్ తో మ‌ల్కాపురం శివ‌కుమార్ నూత‌న చిత్రం

  • IndiaGlitz, [Saturday,June 04 2016]

రొటిన్‌కు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకునే యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ హీరోగా మరో నూతన చిత్రం రూపొందనుంది. హీరో నితిన్‌తో ద్రోణ చిత్రాన్ని తెరకెక్కించిన కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. భద్రాద్రి, ఆకాశంలో సగం, సూర్య వర్సెస్ సూర్య, శౌర్య వంటి విభిన్న చిత్రాలను నిర్మించి.. అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు పొందిన మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై నిర్మించబోతున్నాడు.

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ వైవిధ్యమైన కథ, కథనాలతో చిత్రాలను తెరకెక్కించాలనే సంకల్పంతో మా సంస్థలో విభిన్నమైన చిత్రాలను నిర్మిస్తున్నాను. అందులో భాగంగానే సుమంత్ అశ్విన్‌తో సరికొత్త కథ, కథనాలతో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలుంటాయి. సుమంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోయే ఈ చిత్రం అత్యధిక బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అన్నారు.

More News

అన్నగారి ప్రభుత్వం లేకపోవడంతో అవార్డ్ ఇవ్వలేదు..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన సంచలన చిత్రం అసెంబ్లీ రౌడీ.ఈ చిత్రాన్ని బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించారు.

'అఆ'కి కత్తెర పడింది

నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘అఆ’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది.

రైట్ రైట్ సినిమాతో నాలో ఆ న‌మ్మ‌కం క‌లిగింది - బాహుబ‌లి ప్ర‌భాక‌ర్

సుమంత్ అశ్విన్, పూజా జ‌వేరి, కాళికేయ ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో మ‌ను తెర‌కెక్కించిన చిత్రం రైట్ రైట్. ఈ చిత్రాన్నివంశీకృష్ణ రెడ్డి నిర్మించారు. 

ఆయూస్ సంస్థకు జెంటిల్ మన్ టీం & అభిషేక్ పిక్చర్స్ సపోర్ట్

హైదరాబాద్ లో స్కూల్ ఫీజు లు కట్టుకోలేని పిల్లల కోసం ఆయూస్ సంస్థ చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చింది.

నా ప్రయత్నానికి గెలుపు అదే - విశాల్

విశాల్,శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాయుడు.ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించారు.