ప్రభాస్ సరసన ‘మల్లీశ్వరి’ బ్యూటీ!

  • IndiaGlitz, [Tuesday,March 10 2020]

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. అయితే ఈ కాంబోలో సినిమా ఎలా ఉంటుంది..? కథ ఎలా ఉండబోతోంది..? అనేదానిపై ఇటు టాలీవుడ్‌లో.. అటు సోషల్ మీడియా.. మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది.

మరో వైపు ప్రభాస్ సరిపడే.. డార్లింగ్‌తో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరబ్బా..? టాలీవుడ్ నుంచే తీసుకుంటారా..? లేకుంటే ‘సాహో’కు పట్టుకొచ్చినట్లుగానే బాలీవుడ్ భామనే పట్టుకొస్తారా..? అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదివరకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపిక పదుకుణె నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఇటీవలే ఆమె మేనేజర్‌ను సంప్రదించి అపాయిట్మెంట్ తీసుకున్న నాగీ.. కథ వినిపించాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా.. దీపికా షాకివ్వడంతో మరో బాలీవుడ్ బ్యూటీని పట్టారని తెలుస్తోంది.

ఆ బ్యూటీ మరెవరో కాదండోయ్.. కత్రినా కైఫ్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కత్రినాతో సంప్రదింపులు జరుపగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. తెలుగులో కత్రినా నటించడం కొత్తేమీ కాదు.. గతంలో తెలుగులో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లీశ్వరి’ సినిమాలో మొదటిసారిగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో చాలా మంది తెలుగు ప్రేక్షకులను పొందింది. అనంతరం ‘అల్లరి పిడుగు’ సినిమాలో కూడా నటించింది. అయితే.. ఆ తర్వాత బాలీవుడ్‌లో కత్రినా బిజిబిజీగా ఉంది. తెలుగులో అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్న నాగీ.. ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజానిజాలెంతో అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

More News

'లవ్ స్టొరీ' 'ఏయ్ పిల్లా' సాంగ్  మార్చి11విడుదల

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ  ‘‘లవ్ స్టోరీ’’.సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో

కరోనా గురించి భయపడొద్దు.. ఇలా నివారించండి!

‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడీ వైరస్ తెలుగు రాష్ట్రాలకు పాకడంతో ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు భయంతో వణికిపోతున్నారు.

క్రిమినల్ లాయ‌ర్‌గా మారుతున్న రామ్ హీరోయిన్‌

మాళ‌వికా శ‌ర్మ‌.. పేరు పెద్ద‌గా గుర్తుండ‌క‌పోవ‌చ్చు. ముంబై నుండి టాలీవుడ్‌కి దిగుమ‌తి అయిన ఈ సొగ‌స‌రి ర‌వితేజ స‌ర‌స‌న నేల‌టిక్కెట్టు చిత్రంలో న‌టించింది.

మెగా హీరోతో న‌టించ‌డానికి ఉపేంద్ర ఓకే చెబుతాడా?

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌.

ఆలోచ‌న‌లో ప‌డ్డ బెల్లంకొండ హీరో!!

గ‌త ఏడాది రాక్ష‌సుడు సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘కందిరీగ‌’, ‘ర‌భ‌స’ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్‌తో క‌లిసి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.