‘మలుపు’ హీరోయిన్‌తో ఆది పినిశెట్టి పెళ్లి?

  • IndiaGlitz, [Thursday,July 30 2020]

టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా రెండు వర్గాల ప్రేక్షకులకూ దగ్గరైన నటుడు ఆది పినిశెట్టి. విలన్‌గానూ.. హీరోగానూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ది బెస్ట్ అనిపించుకున్నాడు. ‘రంగస్థలం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఆది మరింత దగ్గరయ్యాడు. ఈ సింపుల్ అండ్ స్వీట్ హీరో త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడనేది కోలీవుడ్ టాక్. ‘మలుపు’ హీరోయిన్‌ నిక్కీ గల్రానీని ఆది పెళ్లి చేసుకోబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆది, నిక్కీ జంటగా ‘మలుపు’, ‘మరకతమణి’ సినిమాల్లో నటించారు.

అప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారినట్టు టాక్. కొంతకాలంగా ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలకు కూడా నిక్కీ హాజరవడం.. ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కరోనా కంట్రోల్ అవగానే వీరి పెళ్లి ప్రకటన రానుందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి ప్రేమ, డేటింగ్, పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఇప్పటివరకూ వీరిలో ఏ ఒక్కరూ స్పందించలేదు.

More News

అయోధ్యలో కరోనా కలకలం.. పూజారి సహా 17 మందికి కరోనా..

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు చూస్తున్న పూజారి సహా అక్కడ భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు మొత్తంగా 17 మందికి కరోనా సోకింది.

ఏపీలో మోగిన ఉప ఎన్నిక నగారా..

ఏపీలో ఉప ఎన్నిక నగారా మోసింది. ఏపీ కౌన్సిల్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

దేశంలో షాకిచ్చిన కరోనా.. ఇంత పెద్ద మొత్తంలో కేసులు ఇదే తొలిసారి..

దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేడు కరోనా కేసుల సంఖ్య షాకిచ్చింది. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

తెలంగాణ కరోనా అప్‌డేట్.. ఇవాళ ఎన్నంటే..

తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలకూ కరోనా విస్తృతంగా వ్యాపించింది.

అన్‌లాక్ -3 మార్గదర్శకాలివే..

అన్‌లాక్-3కి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసింది.