Yatra 2:యాత్ర 2 : ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ .. సీఎం జగన్ పాత్రపై సస్పెన్స్కు చెక్, వైఎస్ఆర్ కొడుకుగా ఆయనే


Send us your feedback to audioarticles@vaarta.com


2019 ఎన్నికల సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి ఇందులో వైఎస్సార్ పాత్రను పోషించగా.. మహీ వి రాఘవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమయంలోనే యాత్రకు సీక్వెల్ కూడా వుంటుందని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వైఎస్సార్ జయంతి నాడు ‘‘యాత్ర 2’’ మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వైఎస్సార్ కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ నిజ జీవితంలో చోటు చేసుకున్న ఘటనలతో సీక్వెల్ తెరకెక్కనుంది. అయితే జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటించబోతున్నారన్నది చెప్పకుండా చిత్రయూనిట్ సస్పెన్స్లో పెట్టింది.
తాజాగా దీనికి చెక్ పెడుతూ యాత్ర 2 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించనున్నారు. ఈ పోస్టర్లో ఓ వైపు మమ్ముట్టి, మరోవైపు జీవా వున్నారు. ‘‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని ’’ అని పోస్టర్లో రాసుకొచ్చారు. దీనితో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. 2024 ఫిబ్రవరి 8న యాత్ర 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు.
యాత్ర మొదటి భాగాన్ని ఫిబ్రవరి 9, 2019న విడుదల చేయగా.. రెండవ భాగాన్ని కూడా అదే తేదీన రిలీజ్ చేస్తుండటం సినీ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా సమయంలోనే మహి వి రాఘవ్ యాత్ర 2 స్క్రిప్ట్పై పనిచేసినట్లుగా తెలుస్తోంది. ఇదే టైంలో సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీస్లు తెరకెక్కించారు. అ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా యాత్ర 2 ద్వారా ఆయన ఎన్ని సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి. అన్నట్లు ఈ సినిమాను వీ సెల్యూలాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout




-
Devan Karthik
Contact at support@indiaglitz.com