close
Choose your channels

నిశ్చితార్థమైన యువతికి బస్సులో తాళికట్టిన ప్రబుద్ధుడు!

Thursday, December 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అవును మీరు వింటున్నది నిజమే.. ఓ ఆకతాయి.. బస్సులో ప్రయాణిస్తున్న యువతి మెడలో బలవంతంగా తాళికట్టాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులు.. బస్సును ఆపి నిందితుడ్ని దుమ్ముదులిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. ఈ ఘటన తమిళనాడులోని అంబూరు సమీపంలోని సాండ్రోర్ కుప్పంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వివరాలు వెల్లడించారు.

అసలేం జరిగింది..!

‘కుప్పం గ్రామానికి చెందిన జగన్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కళాశాలలో చదువుతున్నపట్నుంచి ఆమెను ప్రేమిస్తున్నప్పటికీ ప్రపోజ్ చేయలేదు. అయితే ఈ మధ్యే పెద్దల నిశ్చయించిన వ్యక్తితో ఆ యువతికి నిశ్చితార్థం అయ్యింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రబుద్ధుడు.. ‘ఐ లవ్ యూ’ అని ప్రపోజ్ చేశాడు. అయితే అప్పటికే సగం పెళ్లి అయిపోవడంతో.. ఇలా సడన్‌గా చెప్పేసరికి యువతి అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ఆ యువతిపై కోపం, పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి బస్సులో వెళ్తుండగా ఆమె ఉన్న సీటు దగ్గరికెళ్లి.. బలవంతంగా తాళి కట్టాడు. దీంతో ఆ యువతి గట్టిగా కేకలు వేయడంతో ప్రయాణికులు చితకబాదారు’ అని పోలీసు అధికారి మీడియా వెల్లడించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.