కార్మికుల కోసం మనం సైతం ఉచిత వైద్య శిబిరం

  • IndiaGlitz, [Saturday,August 10 2019]

తమ చుట్టూ ఉన్నవారంతా తమ వాళ్ళే అనుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తోంది కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని మనం సైతం సేవా సంస్థ. చిత్రపురి కాలనీలో కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జనసేన నేత జెడి లక్ష్మి నారాయణ అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. నాది ఏ రాజకీయ రంగూ కాదు. నా రంగు రక్తం రంగు ఎరుపు. ఈ రంగుకు పేదా, ధనికా తేడా లేదు. అందరిదీ ఒకటే. పేదలకు ఎక్కడ అవసరం ఉన్నా నా వంతు సాయం అందిస్తా. నేను పేదవాడిని. అందుకే పేదలకు అండగా నిలబడ్డాను. వివిద రాష్ట్రాల నుంచి ఎంతోమంది కార్మికులు పొట్టకూటి కోసం ఇక్కడికి పనిచేసేందుకు వస్తున్నారు. వాళ్లకు అనారోగ్య సమస్యలు తరుచూ ఎదురవుతుంటాయి. చికిత్స తీసుకునే స్తోమత ఉండదు. అందుకే చిత్రపురి కాలనీలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. నా సేవా కార్యక్రమాలు కేవలం పేదల కోసమే. ఎలాంటి రాజకీయ ఉద్ధేశాలు లేవు. టీఆర్ఎస్ లో నేనొక కార్యకర్తను. మనం సైతం కార్యక్రమానికి ఎప్పుడూ అండగా ఉంటారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న, ఎంపీ రంజిత్ రెడ్డి అన్నగారు. ఇవాళ కార్యక్రమానికి హాజరైన జేడీ లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు. అన్నారు.

జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... కాదంబరి కిరణ్ అలుపు ఎరుగని సేవా సైనికుడు. నిత్యం పేదల కోసమే ఆలోచిస్తుంటాడు. వాళ్లకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. సినిమాల్లో నటిస్తూ ఇంత తీరిక ఈయనకు ఎలా దొరుకుతుంది అని ఆశ్చర్యమేస్తుంటుంది. కిరణ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతం. అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. దాన్ని కాపాడుకుంటేనే ఏదైనా సాధించగలం. కాదంబరి ఆ విషయాన్ని గుర్తించి మీకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అన్నారు

మనం సైతం సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయంటూ కాదంబరిని ప్రశంసించారు ఎమ్మెల్యే ఫ్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి. మనంసైతంకు తాము కూడా అండగా ఉంటామని వారు ప్రకటించారు. మనం సైతం సభ్యులు వల్లభనేని అనిల్, రమేష్ వర్మ, శ్రీధర్ రెడ్డి, వినోద్ బాల, చిత్రపురి కాలనీ పెద్దలు మహానంద రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు కార్యక్రమాన్ని నడిపించారు. ఈ సందర్భంగా మెడికవర్, నేత్రాలయా ఆస్పత్రుల సిబ్బంది కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేశారు.

More News

షూటింగ్ పూర్తి చేసుకున్న గోపీచంద్ `చాణక్య`

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తిరు దర్శకత్వంలో

సాయిపల్లవి 'అనుకోని అతిధి'

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిగా  మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా అధిరన్.

షారూక్ పేరుతో స్కాలర్ షిప్‌

మెల్‌బోర్న్‌కి చెందిన లా ట్రోబ్ యూనివ‌ర్సిటీ షారూక్ ఖాన్ పేరుమీద ఓ స్కాల‌ర్ షిప్‌ను అనౌన్స్ చేసింది.

'విరాటపర్వం' నుండి టబు తప్పుకుందా?

`విరాట ప‌ర్వం 1992` షూటింగ్ స్టార్టయ్యింది. రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. `నీది నాది ఒకే క‌థ` ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే: మంచు విష్ణు

శ్రావణ శుక్రవారాన్ని మన హిందువులు చాలా పవిత్రంగా, విశిష్టమైనరోజుగా భావిస్తుంటారు. ఈరోజున మంచువారి ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవు.