చైన్నైకు అండగా నిలవండి అంటున్న మంచు మనోజ్
- IndiaGlitz, [Tuesday,June 25 2019]
చెన్నై మహానగరంలో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు కనీస అవసరాల నీటి కోసం నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రజల నీటి సమస్యను తీర్చడానికి హీరో మనోజ్ తన వంతు పాత్రను పోషిస్తున్నారు. తనే కాకుండా తన స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి చెన్నై ప్రజలకు నీటిని అందిస్తున్నారు. ఇతరులు కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని ఆయన ట్విట్టర్ ద్వారా విన్నవించారు.
''తెలుగు ప్రజలకు తిండి, నీరు, అవాసం అవసరమైన సమయంలో తమిళ సోదరులు వెంటనే తగు రీతిలో స్పందించారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. మన ఇండియాలోనే 6వ మహానగరం అయిన చెన్నై నీరు లేకుండా ఇబ్బంది పడుతుంది. నా స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారంతో చెన్నైలో నేను పెరిగిన, తిరిగిన ప్రాంతాల్లో తాగునీరుని అందిస్తున్నాను. మీ అందరూ మీ వంతుగా సహాయం చేయాలని కోరుతున్నాను'' అని స్పందించారు మంచు మనోజ్.