నాగార్జున 'మ‌న్మ‌థుడు 2' టీజ‌ర్‌ విడుదల తేదీ

  • IndiaGlitz, [Tuesday,June 11 2019]

కింగ్ నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) నిర్మాత‌లు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఒక షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున‌- ర‌కుల్‌, నాగార్జున‌- కీర్తిసురేష్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. సినిమాపై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలున్నాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు.

మ‌న్మ‌థుడు ఇన్‌స్పిరేష‌న్‌తో, రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

More News

చంద్రబాబుకు ఎందుకంత భయం.. ఇంకా తేరుకోలేదు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పట్లో తేరుకునే పరిస్థితి లేనట్లేనని తెలుస్తోంది.

వైఎస్ జగన్‌ను కలిసిన నిఖిల్.. రాజకీయాల్లో చర్చ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ గౌడ క‌లిశారు.

ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రివెంజ్ ఉంటుందా!?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

ఏపీ సెక్రటేరియట్‌‌కు కత్తి మహేశ్ ఎందుకెళ్లినట్లు!?

టాలీవుడ్‌లో వివాదాలకు మారుపేరుగా ఉన్న సినీ క్రిటిక్ కత్తి మహేశ్ ఉన్నట్టుండి ఏపీ సెక్రటేరియట్‌లో ప్రత్యక్షమయ్యాడు.

రోజా, అంబటి, ఆళ్లకు త్వరలో కీలక బాధ్యతలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవులు ఆశించి.. చివరి నిమిషం వరకు పక్కా అనుకుని దక్కించుకోలేకపోయిన వారిలో రోజా, అంబటి రాంబాబు