మనోహర్ పారికర్ కన్నుమూత.. విషాదంలో కమలదళం
Send us your feedback to audioarticles@vaarta.com
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తుదిశ్వాస విడిచారు. 63 ఏళ్ల పారికర్ కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన తన నివాసంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. కాగా.. 'ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.. ఆయన్ను దక్కించుకోవడానికి డాక్టర్లు శక్తిమేర శ్రమిస్తున్నారు' అని ఆయన కార్యాలయం నుంచి ట్వీట్ వచ్చిన కొద్దిసేపటికే మరణించారనే వార్త వినాల్సి వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న కమలనాథులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా.. పారికర్ భార్య మేధా 2001లోనే మృతి చెందారు. పారికర్-మేధా దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. అతి చిన్న వయస్సులోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారిన ఆయన నిరాడంబరంగా ప్రజాసేవకుడిగా మారారు. మొత్తం నాలుగు పర్యాయాలు పారికర్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2000-05, 2012-2014 సీఎం పనిచేసిన ఆయన ఆ తర్వాత రక్షణ మంత్రిగాను.. యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
గోవా ఎన్నికల అనంతరం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో.. మరోసారి ఆయన సీఎం పీఠం అధిరోహించారు. ఈయనకు ఒక్క బీజేపీ కార్యకర్తలు, అభిమానులే కాదు దేశ వ్యాప్తంగా పార్టీలు, మతాలకు అతీతంగా అభిమానులున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.