'మరకతమణి' పాటలు విడుదల

  • IndiaGlitz, [Sunday,June 04 2017]

ఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని హీరో హీరోయిన్లుగా రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై A.R.K శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తమిళ‌, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో జూన్ లో విడుద‌ల‌కి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను మార్కెట్లోకి విడుద‌ల చేశారు. తొలి సీడీని హీరో నాని ఆవిష్క‌రించారు.

సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న‌కు మ‌ర‌క‌త‌మ‌ణి తెలుగులో తొలి సినిమా. త‌న‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరో ఆది పినిశెట్టి అందించిన సహ‌కారంతోనే మంచి మ్యూజిక్ అందించ‌గ‌లిగాన‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ దిబు నైన‌న్ థామ‌స్ తెలిపారు. దాసరిగారు ఈరోజు మన మధ్య లేరు. సినిమా అనేది హీరో సినిమా కాకుండా దర్శకుడి సినిమా కావాలనేది ఆయన కల. ఆయన కలలో ఇవ్వాల్టి హీరోలందరూ భాగమైతే ఆ కల నిజమైనట్లే. ఇక మరకతమణి విషయానికి వస్తే సంగీతం చాలా బావుంది. ట్రైలర్‌ బావుంది. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నానని హీరో నాని చెప్పారు

ఈ యంగ్‌ జనరేషన్‌ హీరోలందరూ బేషజాలు లేకుండా కలిసిపోతున్నారు. ఇక ఆదికి త్వరలోనే పెళ్ళి చేయాలనుకుంటున్నాం. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా పెద్ద హిట్‌ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు, డబ్బులు తేవాలని కోరుకుంటున్నాను అని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ర‌విరాజా పినిశెట్టి తెలిపారు. సినిమా స్క్రిప్ట్‌ బేస్‌డ్‌ మూవీ. ఓ ఐదుగురి క్యారెక్టర్స్‌ను బేస్‌ చేసుకుని రన్‌ అవుతుంటుంది. స్క్రిప్టే సినిమాలో హీరో. ఇప్పటి వరకు నేను సీరియస్‌ పాత్రలే చేశాను. నేను నటించిన తొలి కామెడి సినిమా అని చెప్పొచ్చు. డైరెక్టర్‌ శరవణన్‌ ఆలోచనతో చేసిన ఈ కథ డిఫరెంట్‌గా ఉంటుంది. దిబు థామస్‌గారు తన ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాకు ప్రాణం పోశారని హీరో ఆది పినిశెట్టి అన్నారు.

ఆది తొమ్మిదేళ్ళుగా నాకు బాగా తెలుసు. సినిమా కోసం కొత్త నటీనటులు ఎలా ప్రయత్నిస్తారో అలా ప్రయత్నిస్తూ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడు. తను ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని అల్ల‌రి న‌రేష్ చెప్పారు. 'ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ అనుకునేవారికి లేదు ఇంకా చాలా ఉంది. టాలీవుడ్‌ ఇంకా చాలా పెద్ద ఇండస్ట్రీ అని నిరూపించిన టాలీవుడ్‌కు హ్యాట్సాఫ్‌. మరకతమణి సినిమా కథ యూనివర్సల్‌ పాయింట్‌తో రూపొందింది కాబట్టి సినిమాను తెలుగులో కూడా చేస్తామని ఆదిగారు ముందు నుండే ఎంకరేజ్‌ చేశారు. అందుకు తగిన విధంగా సపోర్ట్‌ అందించారు. అందరికీ థాంక్స్ అని ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.కె.శ‌ర‌వ‌ణ‌న్ తెలిపారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, కోన‌వెంక‌ట్‌, క‌ళ్యాణ్‌కృష్ణ‌, సంక‌ల్ప్‌, ర‌వికాంత్ పేరెపు, నిక్కి గ‌ర్లాని త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

మల్టీస్టారర్ 'శమంతకమణి' షూటింగ్ పూర్తి - డిజిటల్ పోస్టర్స్ కి అమేజింగ్ రెస్పాన్స్!

నారా రోహిత్,సుధీర్ బాబు,సందీప్ కిషన్,ఆది హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'శమంతకమణి'

కీర్తిసురేష్ ను చూసి భయపడుతున్నారా..

పవన్ కల్యాణ్,త్రివిక్రమ్ కాంబినేష న్ లో సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వర్మ ట్విట్టర్ ను వదలిపోవడానికి నాగబాబే కారణమా?

ఎప్పుడూ తనదైన కామెంట్స్ తో,రాతలతో ఇతరులను టార్గెట్ చేసేవాళ్ళలో రాంగోపాల్ వర్మ ముందుంటారు.

జూలై 7న నేచురల్ స్టార్ నాని, దానయ్య డి.వి.వి.ల 'నిన్ను కోరి'

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మేన్, మజ్ను, నేను లోకల్ వంటి వరస హిట్స్తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని 'నిన్నుకోరి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ టైమింగ్ క్యాచ్ చేయగలనో లేదో అని భయపడ్డాను - అడివి శేష్

నటించిన అతికొద్ది చిత్రాలతోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న నటుడు అడివి శేష్. త్వరలో అనంత్ గా "అమీ తుమీ"తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న విడుదలకానున్న "అమీ తుమీ" గురించి అడివి శేష్ చెప్పిన విశేషాలు..