విక్ర‌మ్ స్టైల్లో మాస్ మ‌హారాజా?

  • IndiaGlitz, [Saturday,September 08 2018]

మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ‘ఖతర్నాక్’, ‘కిక్’, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాల తర్వాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. రవితేజకు ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయి శీను’ లాంటి హ్యాట్రిక్ విజయాలను అందించిన శ్రీను వైట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు.

కాగా అక్టోబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ర‌వితేజ మూడు పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌ని వార్త‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో వార్తొక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే.. ర‌వితేజ ఒక‌టే మూడు పాత్ర‌ల్లో అలరిస్తాడ‌ట‌. అంటే విక్ర‌మ్, శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అప‌రిచితుడు స్టైల్లో అన్న‌మాట‌. మ‌రి దీనిపై యూనిట్ ఏమైనా రిప్లై ఇస్తుందో లేక సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాలో చూడాలి.

More News

'అర‌వింద స‌మేత' ఆడియో ఎప్పుడంటే...?

ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా 'అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌'. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోంది.

'ఇష్టంగా' ఫస్ట్ లుక్ విడుదల

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి.రుద్ర దర్శకత్వంలో  అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ "ఇష్టంగా".

వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 12న వస్తోన్న 'ఎందుకో ఏమో'

మహేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నందు,నోయల్‌, పునర్నవి భూపాలం  హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం 'ఎందుకో ఏమో'.

ఇప్పుడు బుల్లితెర‌పై కూడా...

కృష్ణ త‌న‌య‌.. మ‌హేశ్ సోద‌రి.. నిర్మాత.. ద‌ర్శ‌కురాలు అయిన మంజుల ఘ‌ట్ట‌మ‌నేని వెండితెర నుండి బుల్లితెర‌కు రావ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటంది.

'దేశంలో దొంగలు పడ్డారు' సాంగ్ లాంఛ్ చెసిన శ్రీకాంత్

అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'.