సాయంత్రం ఎస్పీబీ కోసం యూనివర్సల్ మాస్ ప్రేయర్స్ చేద్దాం: ఆర్పీ పట్నాయక్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. దీంతో దేశం మొత్తం ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ట్వీట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఓ నిర్ణయం తీసుకున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిని కాంక్షిస్తూ మాస్ ప్రేయర్స్ నిర్వహించనున్నట్టు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు యూనివర్సల్ మాస్ ప్రేయర్స్ చేద్దామని ఆర్పీ పట్నాయక్ పిలుపునిచ్చారు.

‘‘బాలు గారి ఆరోగ్యం గురించి ప్రేయర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ చాలా చాలా థాంక్స్. ఈ ప్రేయర్స్ ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండాలంటే మనందరం కలిసి ఒకే టైమ్‌లో ఒకేసారి ప్రే చేస్తే దాని పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఉద్దేశంతో మేమంతా కలిసి పొద్దున నేడు(ఆగస్ట్ 18) సాయంత్రం 6 గంటలకు యూనివర్సల్ మాస్ ప్రేయర్స్ చేద్దామని అనుకుంటున్నాం. ప్రపంచంలోని బాలుగారి అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా కలిసి నేటి సాయంత్రం మాస్ ప్రేయర్ చేద్దాం. మనం ఎక్కడున్నా సరే.. అక్కడి నుంచే బాలు గారు ఆరోగ్యంగా ఉండాలనే మన సంకల్పాన్ని ఆయన వరకూ పంపిద్దాం. మనకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థిద్దాం. అందరం కలిసి ఒకే టైమ్‌లో ఒక పాజిటివ్ ఎనర్జీని పంపిద్దాం. ఆ ఎనర్జీతో ఆయన మరింత ఆరోగ్యంతో మనకు ఆయన పాటలు వినిపించాలని కోరుకుందాం’’ అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు.

ఈ యూనివర్సల్ మాస్ ప్రేయర్స్ కారణంగా బాలు కోలకుంటారని.. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని టాలీవుడ్ నమ్ముతోంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్‌ని షేర్ చేయాలని తెలుగు రాని వారు సైతం తమ తమ భాషల్లో ఈ మెసేజ్‌ను ఆయా భాషల ప్రజానీకానికి తెలియజేయాలని ఆర్పీ పట్నాయక్ కోరారు.

More News

టాలీవుడ్ ప్రముఖ సింగర్స్‌కి కరోనా!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరిగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.

అర్థరాత్రి ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా.. వైద్యులేమన్నారంటే..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. నేడు ఆయన తిరిగి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.

ట్విట్టర్ వేదికగా అంబటి వర్సెస్ జనసేన వార్..

ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి జనసేన కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో వార్ నడుస్తోంది.

సంచలనం సృష్టించిన నోవాటెల్ ఘటనలో నిందితుడి అరెస్ట్

విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర జరిగిన దారుణం జరిగింది. కారులో ముగ్గురు ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు.

నిత్యానంద సంచలన నిర్ణయం.. ముహూర్తం కూడా ఫిక్స్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తలకెక్కారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్ట్ 22న ఆయన ఓ సంచలనానికి శ్రీకారం చుట్టనున్నారు.