'మత్తు వదలరా' టీజర్ను విడుదల చేసిన మెగా పవర్స్టార్ రామ్చరణ్!
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ నమ్మకంతోనే మరో యంగ్ టాలెంటెడ్ టీమ్ మత్తు వదలరా అంటూ వినూత్నమైన కాన్సెప్ట్తో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతుండగా, కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు
రితేష్ దర్శకుడిగా అరంగ్రేటం చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూమీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్లుక్ను యంగ్టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయగా, ఈ చిత్ర టీజర్ను నేడు మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఫేస్బుక్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ యంగ్ టాలెంట్ను ప్రోత్సాహించాలనే వుద్దేశంతో నిర్మించిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో చిత్రం వుంటుంది. హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
శ్రీసింహా, నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: రితేష్ రానా
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.