Meena husband: విషాదం... సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూత

  • IndiaGlitz, [Wednesday,June 29 2022]

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం విద్యాసాగర్ ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం బెంగళూరు. ఆయన మీనాను 2009లో పెళ్లాడారు. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె వున్నారు. విద్యాసాగర్ రెండు ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తోంది. పావురం మలమూత్రాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఒక రకమైన అలర్జీ కారణంగా ఆయనకు ఈ వ్యాధి సోకినట్లుగా సమాచారం.

విద్యాసాగర్‌కు పూర్తిగా చెడిపోయిన ఊపిరితిత్తులు:

ఇకపోతే.. ఈ ఏడాది ప్రారంభంలో మీనాతో సహా ఆమె కుటుంబం మొత్తం కోవిడ్ బారినపడింది. ఆ సమయంలో వైరస్‌ను తన ఇంట్లో వుండనివ్వనని.. మీరంతా జాగ్రత్తగా వుండాలంటూ ఆమె ట్వీట్ చేశారు. కరోనా నుంచి అందరూ కోలుకున్నప్పటికీ.. మీనా భర్తను మాత్రం కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో చెన్నై ఆళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలోనే ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. కానీ దాత దొరక్కపోవడంతో అప్పటి నుంచి విద్యాసాగర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రోజు రోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణించినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విద్యాసాగర్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

నేడు విద్యాసాగర్ అంత్యక్రియలు:

కాగా.. 90వ దశకంలో మీనా దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందారు. పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు నటనకు దూరంగా వున్నప్పటికీ ఆ తర్వాత రియాలిటీ షోలకు జడ్జిగానూ, కొన్ని సినిమాల్లోనూ మీనా నటించారు. విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం జరుగుతాయని సమాచారం.

More News

Janasena : సంక్షోభం నుంచి సుభిక్షం వైపుకు .. ఆయనో రాజనీతిజ్ఞుడు : పీవీకి పవన్ కల్యాణ్ నివాళి

దివంగత ప్రధాన మంత్రి, ఆర్ధిక సంస్కరణల పితామహుడు స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి

Khairatabad Ganesh: ఈ ఏడాది ఖైరతాబాద్‌ మహా గణపతి రూపమిదే.. 50 అడుగులు, పూర్తిగా మ‌ట్టితోనే త‌యారీ

దేశంలో గ‌ణేశ్ న‌వ‌రాత్రులు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే న‌గ‌రాల్లో హైద‌రాబాద్ కూడా ఒక‌టి.

అందుకే తారక్ అంటే ఇష్టం .. జూనియర్‌ ఎన్టీఆర్‌పై బాలీవుడ్ విలన్ ప్రశంసలు

కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా నటించి తర్వాత స్టార్ హీరోలుగా ఎదిగిన వారు ఎందరో. రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు, శ్రీకాంత్, గోపిచంద్ ఇలా లిస్ట్ చాలానే వుంది.

సందడిగా "చోర్ బజార్" సక్సెస్ మీట్

ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా చోర్ బజార్.

Sai Kiran : సభ్యత్వం పేరిట రూ.లక్షలు మోసం .. నిర్మాతపై ఫిర్యాదు చేసిన నువ్వేకావాలి సాయికిరణ్

నువ్వేకావాలి సినిమాలో తరుణ్, రిచాలతో పాటు సమానంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సింగర్ సాయి కిరణ్‌ను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు.