ఢిల్లీకి చేరిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై మీరా చోప్రా కేసు

  • IndiaGlitz, [Friday,June 05 2020]

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని మీరా చెప్పడమే పెద్ద మిస్టేక్.! ఈ ఒక్క మాటను పట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ మీరాను దుమ్మెత్తి పోస్తున్నారు. తీవ్ర అసభ్య పదజాలంతో మెసేజ్‌లు చేయడం.. కొందరు అభిమానులు అయితే ఏకంగా చంపేస్తామని బెదిరించడం, గ్యాంగ్ రేప్ చేస్తామని ఈ విషయాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను జోడిస్తూ పోలీసులకు మీరా ఫిర్యాదు చేసింది. అభిమానుల అత్యుత్సాహం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

కాగా ఇప్పటికే ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ దాకా వెళ్లగా.. తాజాగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కేసును బదిలీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఎనిమిది ఖాతాల నుంచే అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించడం జరిగింది. అందులో భాగంగా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా.. ‘67ఎ’ను కూడా ఈ కేసుకు జతచేశారు. అయితే ఫిర్యాదు చేసిన మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో ఆ కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. మరి ఈ కేసుపై ఢిల్లీ పోలీసులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి. అసలు ఇలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై ఢిల్లీ పోలీసులు ఏం చేయబోతున్నారు..? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..? అని ఆ ఎనిమిది మందిలో టెన్షన్ వాతావరణం నెలకోంది. మరి ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ ఇంకా రియాక్ట్ కాలేదు.. ఒక వేళ అయితే ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.

More News

త్వరలో కేసీఆర్‌ను కలవనున్న బాలయ్య..!?

టాలీవుడ్ గత కొన్ని రోజులుగా నటుడు కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం విదితమే.

బాలయ్య గురించి పోసాని ఏమన్నారంటే...

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ 31 టైటిల్‌ ఇదేనా!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి భారీ బ‌డ్జెట్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’లో

ఆగ‌స్ట్‌కు వెళ్లిన ఆచార్య‌..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

థ్రిల్లర్ మూవీ 'A' (AD ‌INFINITUM) టీజర్ ని విడుదల చేసిన  సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్

పరిమిత  బడ్జెట్ తో నిర్మితమైన “A” చిత్రం. ఫస్ట్ లుక్ మరియూ  మోషన్ పోస్టర్ ల విడుదలతో ప్రేక్షకుల  అంచనాలను  పెంచుతుండటం ఆశ్చర్యంగా ఉంది,