మీరా వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ 15 మంది త్వరలో అరెస్ట్!

  • IndiaGlitz, [Saturday,June 06 2020]

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు పలువుర్ని గుర్తించారు. అయితే మీరా.. ఏకంగా మంత్రి కేటీఆర్‌కే ట్వీట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరడంతో సీన్ మారిపోయింది. ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు మొత్తం 15 మంది ట్విట్టర్‌ ఖాతాలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ ఖాతాలను ఉపయోగిస్తున్న వారికి నోటీసులు పంపించారు. వారందరినీ త్వరలోనే పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సమాచారం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని మీరా చెప్పడమే పెద్ద మిస్టేక్.! ఈ ఒక్క మాటను పట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ మీరాను దుమ్మెత్తి పోస్తున్నారు. తీవ్ర అసభ్య పదజాలంతో మెసేజ్‌లు చేయడం.. కొందరు అభిమానులు అయితే ఏకంగా చంపేస్తామని బెదిరించడం, గ్యాంగ్ రేప్ చేస్తామని ఈ విషయాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను జోడిస్తూ పోలీసులకు మీరా ఫిర్యాదు చేసింది. అభిమానుల అత్యుత్సాహం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. కాగా.. ఏపీ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో కలగజేసుకోవాలంటూ మీరా ఫిర్యాదు చేసింది. అయితే ఇంతవరకూ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన కానీ రాకపోవడం గమనార్హం.

More News

రామానాయుడు సేవలు చిరస్మరణీయం : చంద్రబాబు

జూన్-06న మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జయంతి. 85వ జయంతి కావడంతో ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నటీనటులు,

జగన్‌తో భేటీకి రానని చెప్పేసిన బాలయ్య.. నిజమేనా!?

టాలీవుడ్ పెద్దలు జూన్-09న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కాబోతోన్నారు. ఈ భేటీలో పలువురు దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ హాజరుకానున్నారు.

ఏపీలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 161 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా బీభత్సం సృష్టిస్తోంది. మే నెల మొత్తం తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. అయితే జూన్ ప్రారంభం నుంచి మాత్రం పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.

'బొంబాట్‌' రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్ 'స్వామినాథ‌' విడుద‌ల

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా

‘త‌లైవి’ కోసం భారీ ప్రైజ్‌

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న‌ చిత్రం `త‌లైవి`. బాలీవుడ్‌క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.