అల్లువారి రిసెప్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ.. గ్రాండ్ సక్సెస్!!

  • IndiaGlitz, [Friday,July 19 2019]

టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్య బాబీ రెండో వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యమాత్రమే జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి నలుగురి మధ్యే చేసుకున్న బాబీ.. రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గానే ఇచ్చారు. ఈ గ్రాండ్ రిసెప్ష‌న్ వేడుక‌ని అల్లు ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వ‌హించ‌గా.. కార్యక్ర‌మానికి మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్, బ‌న్నీ, శిరీష్‌, వ‌రుణ్ తేజ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. బాబీ రిసెప్ష‌న్‌కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా అవుతున్నాయి. రిసెప్ష‌న్‌కు మెగా ఫ్యామిలీ హాజరుకావడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

కాగా.. బాబీ శ్రీమ‌తి నీలు షాది ముంబై కాగా, ఆమె హైద‌రాబాద్‌లో సెటిలైందన్న విషయం విదితమే. పుణేలోని సింబయాసిస్ నుండి ఎంబీఏ పూర్తి చేసిన నీలు.. తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు. బాబి-నీలు ప్రేమించి.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే.. బాబీకి కొన్నేళ్ళ క్రిత‌మే పెళ్లి కాగా ప‌లు కార‌ణాల వ‌ల‌న మొద‌టి భార్య‌తో విడాకులు తీసుకున్నార‌ని సమాచారం. మొదటి భార్యకు ఓ కుమార్తె కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జూన్-21న అల్లు బాబీకి నీలు అనే యువతితో వివాహం జరిగింది!. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న ఫొటోలను బట్టి చూస్తే అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్క శిరీష్ తప్ప మరెవ్వరూ కనిపించలేదు. అల్లు అరవింద్ కానీ.. అర్జున్ కానీ ఎవరూ లేరన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

More News

ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్.. కేసీఆర్ సంచలన ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గులాబీబాస్, సీఎం కేసీఆర్ పలు సంచలన ప్రకటనలు చేశారు.

‘నిన్నే పెళ్లాడతా’ లోగో ఆవిష్కరించిన - నాగార్జున

గతంలో కింగ్ నాగార్జున, టబు నటించిన ‘‘నిన్నే పెళ్లాడతా’’ చిత్రం సూపర్ హిట్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం విదితమే.

షూటింగ్ ని పూర్తిచేసుకున్న టెంప్ట్ ర‌వి 'వైఫ్‌,ఐ'

ఇటీవ‌ల యూట్యూబ్ లో టీజ‌ర్ తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థ లో టెంప్ట్ రవి గా దూసుకుపోయిన అభిషెక్ రెడ్డి, సాక్షి నిదియా జంట‌గా,

ఆగ‌ష్టు 30న 'సాహో'

'బాహుబలి చిత్రం తరువాత  ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా  యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రం

నాగార్జున ఇంటికి పోలీసు భ‌ద్ర‌త‌

అక్కినేని నాగార్జున ఇంటికి పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. అందుకు కార‌ణం బిగ్‌బాస్‌. ఆయ‌న బిగ్‌బాస్ 3 వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో నాగార్జున ఇంటికి