close
Choose your channels

హాస్పిటల్‌లో సాయితేజ్.. కాకినాడలో సినిమాలు చూస్తూ బన్నీ కాలక్షేపం, ట్వీట్ చేసే తీరిక లేదా..?

Monday, September 13, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హాస్పిటల్‌లో సాయితేజ్.. కాకినాడలో సినిమాలు చూస్తూ బన్నీ కాలక్షేపం, ట్వీట్ చేసే తీరిక లేదా..?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ..పెను ప్రమాదం నుండి వెంట్రుక వాసిలో బయటపడ్డాడు. శుక్రవారం రాత్రి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి తేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఉలిక్కిపడింది. తేజు ప్రమాదానికి గురయ్యాడని తెలిసి మొత్తం మెగా ఫ్యామిలీ హాస్పిటల్‌కు పరుగులు తీసింది. కొందరైతే సాయి పక్కనే వుండి అతని కుటుంబసభ్యులకు అండగా నిలిచారు. అటు చిత్రసీమ ప్రముఖులు సైతం ఆసుపత్రికి తరలివచ్చి సాయిని పరామర్శించారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తేజూ కోలుకోవాలని ఆకాంక్షించారు. తన కుటుంబానికి చెందిన వ్యక్తికి ఇంత ప్రమాదం జరిగినా.. మీడియాలో అదే పనిగా కథనాలు వస్తున్నా.. అల్లు అర్జున్ మాత్రం కనీసం తేజు గురించి ఒక్క ట్వీట్ చేయలేదు.

హాస్పిటల్‌లో సాయితేజ్.. కాకినాడలో సినిమాలు చూస్తూ బన్నీ కాలక్షేపం, ట్వీట్ చేసే తీరిక లేదా..?

ప్రస్తుతం అల్లు అర్జున్ ..పుష్ప చిత్రీకరణలో భాగంగా శనివారం కాకినాడకు వెళ్లారు. షూటింగ్‌కు బ్రేక్ దొరకడంతో కాలక్షేపం కోసం గోపీచంద్ నటించిన సిటీమార్ మూవీ చూశారు. స్థానిక పద్మ ప్రియ హాల్లో మ్యాట్ని షో చూసిన బన్నీ సినిమా బాగుందని తెలిపారు. అయితే తేజు ప్రమాదం జరిగి హాస్పటల్ లో ఉంటె కనీసం ఒక్క ట్వీట్ చేయలేదు. ఇలాంటి సమయంలో హ్యాపీ‌గా సినిమాకు వెళ్లాడంటూ మెగా అభిమానులు బన్నీని ట్రోల్ చేస్తున్నారు. ఒక సాధారణ అభిమానికి ఉన్న బాధ్యత కుటుంబసభ్యుడైన బన్నీకి లేదే అంటూ మండిపడుతున్నారు. వ్యక్తిగతంగా కాల్ చేసి పరామర్శించి వుండొచ్చు.. కానీ ప్రజలకు తెలిసేలా ఒక్క ట్వీట్ పెడితే అభిమానులంతా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు కదా అని మెగా ఫ్యాన్స్ ఆవేదన.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.