అనుపమ ప్రతిభకి ఫ్లాట్ అయిపోయిన మెగాహీరో

  • IndiaGlitz, [Sunday,May 20 2018]

సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో ‘తేజ్.. ఐ లవ్ యు’ రూపొందుతున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అనుపమ నటనకి, ఆమెలో ఉన్న ప్రతిభకి మెగాహీరో తేజు ఫ్లాట్ అయిపోయారంట.

అందుకే.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న తన తదుపరి చిత్రంలో కూడా అనుపమను హీరోయిన్‌గా తీసుకోమని త‌నే సూచించారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘చిత్ర లహరి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో గతంలో ‘ఉన్నది ఒకటే జిందగీ’లో నటించింది ఈ కేర‌ళ‌ కుట్టి. ఈ విధంగా ‘చిత్రలహరి’ సినిమా ద్వారా ఆ హీరో, దర్శకుడితో రెండు సార్లు కలిసి పని చేసే అవకాశం దక్కించుకుంది ఈ భామ. అన్నట్టు.. దిల్ రాజు నిర్మాణంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా అనుపమ రెండోసారి హీరోయిన్‌గా నటిస్తోంది.

More News

ఈ ఏడాదిలో డ‌బ్బింగ్‌తో ఆక‌ట్టుకున్న క‌థానాయిక‌లు

తొలితరం అగ్ర కథానాయికల దగ్గర నుంచి.. ఆ తర్వాత తరంలో వచ్చిన శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి అగ్ర కథానాయికల

తీవ్ర అనారోగ్య ప‌రిస్థిలో మాదాల రంగారావు

విప్ల‌వ న‌టుడు, నిర్మాత‌, రెడ్‌స్టార్ మాదాల రంగారావు గారు నిన్న అన‌గా మే 19 తేదీ సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌తో,

నెక్ట్స్ ఇయ‌ర్ బాల‌య్య డ‌బుల్ ధ‌మాకా

నందమూరి నటసింహం బాలకృష్ణ ‘జై సింహా’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నారు.

'యురేక' 90% శాతం చిత్రీకరణ పూర్తి

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై కార్తీక్ ఆనంద్ , డింపుల్, షాలినీ , మున్నా ,అపూర్వ హీరోహీరొయిన్లుగా

కొడుకులాగే తండ్రి కూడా విజయం సాధిస్తారా?

మహానటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు తీస్తోంది.