ఐఎయ‌స్ ఆఫీస‌ర్‌గా మెగా క్యాంప్ హీరో..!!

  • IndiaGlitz, [Monday,July 13 2020]

గ‌త ఏడాది విడుద‌లైన ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రంతో త‌న కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో 'సోలో బ్రతుకే సో బెటర్'లో నటించాడు. ఇది విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. దీని త‌ర్వాత దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల్సి ఉంది. లాంఛ‌నంగా సినిమాను కూడా ప్రారంభించారు. ఈ సినిమాలో పొలిటిక‌ల్ ట‌చ్ ఉంటుంద‌ట‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇందులో సాయితేజ యంగ్ ఐఎయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఇలాంటి పాత్ర చేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డంతో సాయితేజ్ కొంద‌రు యంగ్ క‌లెక్ట‌ర్స్ ప‌నితీరుని వివిధ వీడియోల రూపంలో అబ్జ‌ర్వ్ చేస్తున్నాడ‌ని టాక్‌.

ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. చిత్ర‌ల‌హ‌రి చిత్రం త‌ర్వాత సాయితేజ్‌, నివేదా పేతురాజ్ క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. అలాగే ఈ చిత్రంలో మ‌రో కీల‌క పాత్ర‌లో రాశీఖ‌న్నా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చాలా గ్యాప్ త‌ర్వాత దేవా క‌ట్టా తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. పుల్లారావు, భ‌గ‌వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వీరుపోట్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి సాయితేజ్ ఓకే చెప్పాడ‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి.