close
Choose your channels

అందమైన ఆదివారం మెగా హీరోలు కలుసుకున్న వేళ..!

Monday, June 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందమైన ఆదివారం మెగా హీరోలు కలుసుకున్న వేళ..!

అవును.. మెగా హీరోలందరూ చాలా గ్యాప్ తర్వాత లవ్లీ సండే నాడు కలుసుకున్నారు. ఈ కలయికకు సాయిధరమ్ తేజ్ ఇళ్లు వేదికైంది. ఆదివారం నాడు మెగా హీరోలందర్నీ.. తన ఇంటికి పిలిచిన తేజ్ పార్టీ ఇచ్చాడు. అందరూ కలవక చాలా రోజులవ్వడం.. ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉండటంతో కలవడానికి వీలు కాలేదు. అందుకే ఆదివారం నాడు ప్లాన్ చేసుకున్న మెగా హీరోస్ తేజ్ ఇంట్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తేజ్ పార్టీ ఇచ్చారు.

ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, శ్రీజ, కళ్యాణ్ దేవ్, సుష్మితతో పాటు అందరూ విచ్చేశారు. అయితే చెర్రీ భార్య ఉప్సీ, అల్లువారబ్బాయిలు మాత్రం పనుల్లో బిజీబిజీగా ఉండటంతో ఈ పార్టీకి హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం సాయిధరమ్‌, కల్యాణ్‌దేవ్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇదే ఫొటోలను పంచుకున్నారు. ‘అందమైన ఆదివారం’ అంటూ వర్షం, ఇల్లు, కుటుంబం, ప్రేమ అనే హ్యాష్‌ట్యాగ్‌లను సాయిధరమ్‌ జత చేశారు.

మెగా హీరోలు షేర్ చేసిన ఒక్కచోట ఉన్న ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ మూవీలో నటిస్తుండగా.. చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’చేస్తుండగా.. సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో ‘భోగి’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.