close
Choose your channels

కోవిడ్ బారినపడ్డ చిరంజీవి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి వదల్లేదంటూ ట్వీట్

Wednesday, January 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడుతున్నారు. అన్ని రంగాలవారికి కరోనా సోకుతున్నా సినీ నటులు పెద్ద సంఖ్యలో బాధితులుగా మారుతున్నారు. ఇప్పటికే కమల్‌హాసన్, విక్రమ్, త్రిష, వడివేలు, మహేశ్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, కరీనా కపూర్, అమృతా అరోరా వంటి స్టార్లు వైరస్ బారినపడ్డారు. తాజాగా ఈ లిస్ట్‌‌లోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోవిడ్ బారినపడ్డానని చిరు తెలిపారు.

స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని చిరంజీవి చెప్పారు. గత కొన్నిరోజుల నుంచి తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా చిరు కోరారు. త్వరలోనే మీ అందరి ముందుకు పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తాను అని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు మెగాస్టార్ కోవిడ్ బారినపడినట్లు తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి 'ఆచార్య' విడుదలకు సిద్ధమైంది. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, భోళా శంకర్, దర్శకుడు బాబి, వెంకి కుడుములతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చిరంజీవి కరోనా బారిన పడడంతో షూటింగ్ పడే అవకాశం వుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.