కొరటాలకు షాకిచ్చిన చిరంజీవి!!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి 152వ చిత్ర‌మిది. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. నిన్న జ‌రిగిన ఓ ఫంక్ష‌న్‌లో చిరంజీవి డైరెక్ట‌ర్ కొర‌టాల‌కు పెద్ద షాకే ఇచ్చాడు. అదేంటంటే త‌న 152వ సినిమా టైటిల్‌ను రివీల్ చేసేయ‌డం. త‌న సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ను అనుకుంటున్న‌ట్లు చిరు చెప్పేశాడు. అయితే ఈ టైటిల్ కోసం పెద్ద ఈవెంట్‌ను డైరెక్ట‌ర్ కొరటాల ప్లాన్ చేశాడ‌ని అయితే అనుకోకుండా తాను చెప్పేశాన‌ని, ఏమ‌నుకోకండి అంటూ డైరెక్ట‌ర్ శివ‌ను కోరారు చిరు. అంటే చిరు 152 టైటిల్‌గా ఆచార్య ఖరారైన‌ట్టే.

దేవ‌దాయ శాఖ‌లో అవినీతి, న‌క్స‌లిజం నేప‌థ్యాల్లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ పాత్ర దాదాపు అర‌గంట‌పాటు ఉంటుంది. నిజానికి చిరంజీవితో రామ్‌చ‌ర‌ణ్ న‌టించాల్సిన చిత్ర‌మ‌ది. అయితే 'ఆర్ఆర్ఆర్‌' సినిమా కార‌ణంగా రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో చ‌ర‌ణ్ స్థానంలో మ‌హేశ్‌ను సంప్ర‌దించ‌డం..ఆయ‌న ఓకే అన‌డం అంతా చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. సోనూసూద్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అలాగే త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

'RRR' ఫుల్ ఫామ్ ఇదేనట.. త్వరలో అధికారిక ప్రకటన!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా

చిరు, అలీ ఇద్దరూ కాదు.. అంబానీకి మాటిచ్చేసిన జగన్!

టైటిల్ చూడగానే ఇదేంటబ్బా తలా తోకా లేకుండా ఉంది.. అసలు మెగాస్టార్ చిరంజీవికి.. అలీకి సంబంధమేంటి..? వారిద్దరి మధ్యలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

నాకు ఓ సలహా కావాలి.. ఇవ్వండి.. : ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి కోడలు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. సామాజిక విషయాల్లో తన వంతుగా కృషి చేస్తుంటారు. అదే విధంగా ప్రజలకు పలు విషయాల్లో సందర్భాన్ని

ప్రభాస్-నాగీ మూవీలో స్టార్ హీరోయిన్!

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక

'దిశ' షూటింగ్ ప్రారంభించిన ఆర్జీవీ

టాలీవుడ్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఎమోషనల్ స్క్రిప్టును ఎంచుకున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. యథార్థ కథాంశాలతో