ముఖ్య అతిథిగా మెగాస్టార్...

  • IndiaGlitz, [Tuesday,March 28 2017]

త‌న సినిమాల స‌బ్జెక్ట్స్ ఎంపిక‌లో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ త‌ర్వ‌లోనే త‌న 151వ సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత మెగా హీరోల ఫంక్ష‌న్స్‌కు రావ‌డం మానేశాడు. అయితే చిరంజీవిని మెగా బ్ర‌ద‌ర్ త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ మిస్ట‌ర్ వేడుకకు ప్ర‌త్యేకంగా ఆహ్వానించాడ‌ట‌. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.
వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య‌త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం 'మిస్ట‌ర్‌'.మిక్కి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం మార్చి 29న జ‌ర‌గ‌నుంది. సినిమాను ఏప్రిల్ 14న విడుద‌ల చేస్తారు. అల్రెడి విడుద‌లైన ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

More News

పవన్ కళ్యాణ్ తో ఆది పినిశెట్టి...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

వాట్ యాన్ ఐడియా రామ్ జీ...!

జనరల్ గా సినిమా రిలీజ్ దగ్గర పడుతోందంటే ఆ విశేషాలు చెప్పడానికి హీరోలు మీడియాని కలుస్తుంటారు.

పవన్ కళ్యాణ్ సినిమాకు డేట్ ఫిక్సయ్యింది...

జల్సా,అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత క్రేజీ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

రజనీకాంత్ టైటిల్ తో హీరో విజయ్...

తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న తన 61వ సినిమాలో నటిస్తున్నాడు.

ఇప్పుడు కన్నడంలోనే చేస్తున్నాడు....

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి గౌడ తనయుడు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా పరిచయం అయిన చిత్రం 'జాగ్వార్'.