మెగాస్టార్‌తో మెహ‌ర్ చేయ‌బోయేది ఆ రీమేకా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వ‌రుస సినిమాలు తెర‌కెక్క‌డానికి ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. ఈ లిస్టులో డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్‌ను ఉండ‌టం గ‌మ‌నార్హం. చాలా గ్యాప్ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట్ చేయ‌నున్న చిత్ర‌మిదే. మెహ‌ర్ చిరుతో ఓ రీమేక్ చిత్రం చేయ‌బోతున్నార‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మాచారం మేర‌కు త‌మిళంలో అజిత్ హీరోగా న‌టించిన ‘వేదాళ‌మ్‌’ సినిమా రీమేక్‌లో చిరంజీవి న‌టించ‌నున్నార‌ట‌. చిరంజీవి స‌న్నిహితుడైన‌ర సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్‌.రామారావు క్రియేటివ్ క‌మ‌ర్‌షియ‌ల్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగుతుంది. ఒక‌వేళ ఈ తెలుగులో చిరు ఈ మేర‌క్‌లో న‌టిస్తే మ‌రి ఇందులో చిరంజీవి చెల్లెలుగా ఎవ‌రు న‌టిస్తారు? అనేది ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మే.

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాతే షూటింగ్‌ను స్టార్ట్ చేస్తార‌ట‌. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. ఇప్పుడు సినీ పెద్ద‌లు షూటింగ్స్ నిమిత్తం ప్ర‌భుత్వాలు కొన్ని విధివిధానాలో అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ స్టార్స్ షూటింగ్స్ స్టార్ట్ చేయ‌డానికి ఆలోచిస్తున్నారు.

More News

తెలంగాణలో కొత్తగా 2207 కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

3 రాజధానులపై అధికార, విపక్షాల తాజా కలవరమిది!

మూడు రాజధానుల విభజన అంశం అటు అధికార పార్టీ, ఇటు విపక్ష నేతలు కొందరిలో కల్లోలం రేపుతోంది.

పరుచూరి వెంకటేశ్వరరావు భార్య మృతి

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి(74) కన్నుమూశారు.

ప్రభాస్ కొత్త కారేమో కానీ.. అక్కడ మాత్రం సందడే సందడి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త కారు కొన్నాడు.. ఆయన కారు కొనడమేమో కానీ తన కారును రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్లిన ప్రాంతమంతా సందడి సందడిగా మారింది.

చిరు ఇంటికెళ్లిన సోము వీర్రాజు.. పలు విషయాలపై చర్చ

స్టార్ హీరో, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవిన నేడు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు.