న‌వీన్ చంద్ర మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు..?

  • IndiaGlitz, [Tuesday,September 13 2016]

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ 'ఓ చినదాన', 'ఒట్టేసిచెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్‌ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్‌ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ ఆగస్ట్‌ 12తో పూర్తయింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. నాన్ స్టాప్‌గా జ‌రుగుతున్న ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి మీలో ఎవ‌రు కోటీశ్వ‌ర‌డు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

నవీన్‌ చంద్ర, శృతిసోది జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని క ష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చమ్మక్‌ చంద్ర, పిళ్ళా ప్రసాద్‌, విద్యుల్లేఖా రామన్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., ఎడిటింగ్‌: గౌతంరాజు, కథ: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రమ్‌రాజ్‌, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

More News

అభినేత్రి ఆడియో రిలీజ్ డేట్

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి’లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు.

ఈ టైటిల్ చైతు కోస‌మేనా..?

`సాహసం శ్వాస‌గా సాగిపో`, `ప్రేమమ్` చిత్రాలు త‌ర్వాత అక్కినేని నాగ‌చైత‌న్య చేయ‌నున్న సినిమా కల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది. ఈ విష‌యాన్ని అక్కినేని నాగార్జున తెలియ‌జేశారు.

ఆ ఆలోచ‌న నుంచి పుట్టికొచ్చిందే సిద్దార్ధ - సాగ‌ర్

మొగ‌లిరేకులు సీరియ‌ల్ తో బాగా పాపుల‌ర్ అయిన సాగ‌ర్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని ద‌యానంద్ రెడ్డి తెర‌కెక్కించారు.

ప‌వ‌న్ కొత్త పుస్త‌కం నేను- మ‌నం - జ‌నం..!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ సిద్దాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ఓ పుస్త‌కం రాస్తున్నారు. ఈ పుస్త‌కం పేరు నేను - మ‌నం - జ‌నం (మార్పు కోసం యుద్ధం).

అక్టోబర్‌ 7న సునీల్‌ ఈడు గోల్డ్‌ ఎహే

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా  చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే.ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.