'మా అసోసియేష‌న్‌' లో యువ‌హీరో వ‌రుణ్‌కి స‌భ్య‌త్వం

  • IndiaGlitz, [Sunday,November 19 2017]

యంగ్ ట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు వ‌రుణ్‌. వ‌రుణ్ న‌టించిన 'ల‌జ్జ‌', 'మ‌న‌లో ఒక‌డు' తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ప్ర‌క‌టించిన నంది పుర‌స్కారాల్లో 'మ‌న‌లో ఒక‌డు' (2016) చిత్రానికి అవార్డు ద‌క్క‌డం విశేషం. ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్యాక్‌గ్రౌండ్ తో ప‌ని లేకుండా న‌వ‌త‌రం ట్యాలెంటుకు ఆద‌రణ ద‌క్కుతున్న ప్ర‌స్తుత సినారియోలో వ‌రుణ్ హీరోగా నిరూపించుకునేందుకు త‌న‌వంతు హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు.

హీరో వ‌రుణ్ మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో స‌భ్య‌త్వం తీసుకున్నారు. మా అధ్య‌క్షులు శివాజీ రాజా స‌మ‌క్షంలో తాను కూడా 'మా' లో స‌భ్యుడిన‌వ్వ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని వ‌రుణ్ తెలిపారు. ప్ర‌తిష్ఠాత్మ‌క 'మా అసోసియేష‌న్‌' లో స‌భ్య‌త్వం మ‌రింత బాధ్య‌త పెంచింద‌ని, చ‌క్క‌ని క‌థాంశం ఉన్న చిత్రాల్ని ఎంచుకుని న‌టిస్తాన‌ని తెలిపారు.

మా అధ్య‌క్షులు శివాజీ రాజా మాట్లాడుతూ .. న‌వ‌త‌రం న‌టీన‌టుల ప్ర‌తిభ‌కు టాలీవుడ్‌లో కావాల్సినంత ప్రోత్సాహం ఉంది. వ‌రుణ్ పెద్ద హీరోగా ఎద‌గాల‌ని ఆకాంక్షిస్తున్నా.. అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నిర్మాత, 'మా' ఈసీ మెంబ‌ర్ సురేష్ కొండేటి, న‌టులు హ‌రిబాబు, శ్రీ‌నివాస్ .. "న‌వ‌త‌రం హీరో వ‌రుణ్ ప్ర‌తిభ‌ను నిరూపించుకుని, పెద్ద స్థాయికి ఎద‌గాల‌" ని ఆకాంక్షించారు.

More News

డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న 'దేవిశ్రీ ప్రసాద్' చిత్రం

యశ్వంత్ మూవీస్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం 'దేవిశ్రీప్రసాద్'.  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రంలో    పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్నారు.

అవార్డులు చుట్టాల‌కే... మంచి సినిమాలకు కాదు: హార్మోన్స్ చిత్ర ద‌ర్శ‌క‌,నిర్మాతలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డులు ర‌చ్చ‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా 'హార్మోన్స్'  చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు రోడ్డెక్కారు.

ఛలో అసెంబ్లీ కి తమ్మారెడ్డి భరద్వాజ సపోర్ట్

ఆంధ్ర-తెలంగాణ విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం సహకరించకపోగా.. విభజించి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటివరాకీ ప్రత్యేక రాజధాని నిర్మించుకోడానికి కనీస స్థాయి వెసులుబాటు కలిగించలేదు.

వానవిల్లు ఆడియో వేడుద‌ల

రాహుల్‌ ప్రేమ్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రతీక్‌, శ్రావ్య, విశాఖ హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాతగా ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్ హ‌రోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వహించారు.

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న హీరో గోపీచంద్ 25వ చిత్రం

ఆంధ్రుడు, య‌జ్ఞం, ల‌క్ష్యం, శౌర్యం, లౌక్యం వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా కొత్త చిత్రం ఈరోజు హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది.