మేము చాలా న‌మ్మ‌కంగా ఉన్నాం - నిర్మాత‌ జూల‌కంటి మ‌ధుసూద‌న్ రెడ్డి

  • IndiaGlitz, [Wednesday,July 06 2016]

సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో ఈనెల 8న విడుదలవుతోంది. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను "స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ "2 డి ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై.. సూర్య స్వయంగా సమర్పిస్తుండడం విశేషం. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. చిత్ర నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి, ప్రముఖ నిర్మాతలు కె.వి.వి.సత్యనారాయణ, కె.అచ్చిరెడ్డి, మల్కాపురం శివకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, ఫైనాన్సియర్ మల్లిఖార్జున్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ లతో పాటు ప్రముఖ నటుడు సాయికుమార్ పాల్గొన్నారు.

"పిల్లలతో పాటు పెద్దలు తప్పక చూడాల్సిన సినిమా ఇది. సూర్య వంటి సూపర్ స్టార్ ఈ సినిమాని తమిళంలో నిర్మిస్తూ నటించాడంటే.. దాన్ని బట్టి ఈ చిత్రం గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో మరింత పెద్ద విజయం సాధిస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ వినోదాన్ని పంచుతూనే.. చక్కని సందేశాన్నిచ్చే చిత్రమిది" అని వక్తలు పేర్కొన్నారు. ఈ చిత్రం సాధించబోయే విజయంపై "మేము" చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అర్రోల్ కొరెల్లి, చాయాగ్రహణం: బాలసుబ్రమణియన్, మాటలు-పాటలు: శశాంక్ వెన్నెలకంటి, సమర్పణ: "సూపర్ స్టార్" సూర్య-కె.ఇ. జ్ఞాన వేల్ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: పాండిరాజ్!!

More News

జూనియ‌ర్ కుప్ప‌న్న ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన మోహ‌న్ బాబు

న‌టి, నిర్మాత‌, టెలివిజ‌న్ వ్యాఖ్యాత‌గా పేరొందిన మంచుల‌క్ష్మి అన్ని రంగాల్లోనూ త‌న‌దైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడు చూసినా ల‌క్ష్మి నే క‌నిపిస్తుంది, త‌న భ‌ర్త ఎక్కువ‌గా ఎక్క‌డా క‌నిపించ‌డు అనుకునే వాళ్ల కోస‌మో ఏమో... సాఫ్ట్ వేర్ గా స్థిర‌ప‌డిన ల‌క్ష్మి భ‌ర్త ఆనంద్ ఇప్పుడు హోటల్ రంగంలో అడుగుపెట్టి, అంద‌రి కంటా ప‌డుత

ఐదేళ్ల తర్వాత న్యూ బిగినింగ్ అంటున్న నాయిక...

ఐదేళ్ల తర్వాత న్యూ బిగినింగ్ అంటున్న నాయిక ఎవరో కాదు అందాల నాయిక అంజలి.షాపింగ్ మాల్,జర్నీ,సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు,గీతాంజలి,డిక్టేటర్...

A సర్టిఫికేట్ తో 300 దియోటర్స్ లో రష్మి గౌతమ్ సినిమా రేపే విడుదల

'గుంటూరు టాకీస్'లాంటి సూపర్డూపర్ హిట్ చిత్రంతో యువత హ్రుదయాల్లో పర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న రష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్రదానపాత్రలో నటించిన చిత్రం 'అంతం'.

బన్ని, హరీష్ శంకర్ ఇద్దరికీ ఆమే కావాలట...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు బ్లాక్ బష్టర్ తర్వాత హరీష్ శంకర్ తో మూవీ చేయనున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

కార్తీ కాష్మోరా ఎంత వరకు వచ్చింది....

కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కాష్మోరా.హర్రర్ కధాంశంతో రూపొందుతున్న కాష్మోరా చిత్రాన్ని గోకుల్ తెరకెక్కిస్తున్నారు.