డిసెంబర్ 4న వస్తున్న'మేము'

  • IndiaGlitz, [Monday,November 23 2015]

సూపర్‌స్టార్‌ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న తమిళ చిత్రం పసంగ'2' తెలుగులో మేము' పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. అమలాపాల్‌, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకుడు. ఇప్పటివరకు పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలు అసాధారణ విజయం సాధించి ఉండడానికి తోడు.. పసంగ'2' చిత్రాన్ని ఆ చిత్ర కథానాయకుడు సూర్య నిర్మిస్తుండడంతో..

ఈ సినిమాకు గల క్రేజ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తుండగా.. సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి సహ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాూ శరవేగంగా పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా సాయిమణికంఠ క్రియేషన్స్‌ అధినేత-చిత్ర నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. తమిళ'తెలుగు భాషల్లో కలిపి వంద కోట్లకు పైగా మార్కెట్‌ కలిగిన సూర్య నటిస్తూ.. తమిళంలో నిర్మిస్తున్న పసంగ-2' చిత్రాన్ని మేము' పేరుతో తెలుగు ప్రేక్షకుకు అందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. సూర్య చేతుల మీదుగా విడుదలైన మేము' ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోంది. డిసెంబర్‌ 4న ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మనం, దృశ్యం' చిత్రాల కోవలో మేము' ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది' అన్నారు.

పిశాచి' ఫేం అరోల్‌ కొరెల్లి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి, సంభాషణలు: శశాంక్‌ వెన్నెలకంటి, సహ నిర్మాతలు: ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి, సమర్పణ: సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌ !!

More News

'లోఫర్' ఆడియో డిసెంబర్ 7న

వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా లోఫర్.పూరి జగన్నాథ్ దర్శకుడు.సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై .లిమిటెడ్ పతాకంపై రూపొందింది.

మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'సరదా' ఫస్ట్ లుక్

మంచు విష్ణు హీరోగా డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో సినిమా రూపొందుతోన్న చిత్రం సరదా.

'సినీమహాల్' ఆడియో రిలీజ్

కళానిలయ క్రియేషన్స్ పతాకంపై సిద్దాంస్,రాహుల్,తేజస్విని హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం ''సినీ మహల్''.

తెలుగు ప్రేక్షకులు మరో చరిత్రతో డోర్ ఓపెన్ చేశారు.. చీకటిరాజ్యం సక్సెస్ తో ప్రయోగాల డోర్ తెరిచారు - కమల్ హాసన్

'మరో చరిత్ర'వంటి క్లాసిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు కమల్ హాసన్.సాగరసంగమం, స్వాతిముత్యం,శుభ సంకల్పం వంటి సినిమాలతో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేశారు.

ధనుష్ థ్రిల్లింగ్ పెర్ఫామెన్స్ తో 'మరియన్ ' బాక్సాఫీస్ హిట్ సాధించింది - నిర్మాత సి.జె.శోభ

ధనుష్ హీరోగా,పార్వతీ మీనన్ హీరోయిన్ గా భరత్బాల దర్శకత్వంలో ఆస్కార్ ఫిలింస్ ప్రై.లి.పతాకంపై ప్రముఖ నిర్మాత ఆస్కార్ వి.రవిచంద్రన్ తమిళంలో నిర్మించిన 'మరియన్' చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.