‘‘ దేవుడు నా బ్రా కొలతలు కొలుస్తున్నాడు ’’ : బుల్లితెర నటి శ్వేతా తివారి వ్యాఖ్యలు, హోంమంత్రి సీరియస్

  • IndiaGlitz, [Friday,January 28 2022]

సినిమాలు, షూటింగ్‌లతో నిత్యం బిజీగా వుండే సినీ తారల్లో కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలా కొంతమంది కనిపిస్తారు. తాజాగా అచ్చం ఇదే తరహా వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు సీనియర్ హీరోయిన్, బుల్లితెర నటి శ్వేతా తివారి. హిందీ సీరియల్స్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి ఈమె సుపరిచితురాలు.

ఈ నేపథ్యంలో ‘‘షో స్టాపర్' వెబ్ సిరీస్ టీమ్ బుధవారం భోపాల్ వెళ్లింది. సౌరభ్ రాజ్ జైన్, రోహిత్ రాయ్ తదితరులతో కలిసి షో స్టాపర్‌లో శ్వేతా తివారి కూడా నటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ శ్వేత సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవంతుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. ఈ హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేవుడిపై అలాంటి వ్యాఖ్యలేంటి అంటూ నెటిజన్లు శ్వేతపై దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్తా.. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి వెళ్లాయి.

ఈ వ్యవహారం గురించి విలేకరులు నరోత్తమ్ మిశ్రాను ప్రశ్నించగా.. నేను విన్నాను... చూశాను కూడా. వాస్తవాలు తెలుసుకుని 24 గంటల్లో నివేదిక సమర్పించాల్సిందిగా భోపాల్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాను అని ఆయన వెల్లడించారు. ఇకపోతే శ్వేతా తివారిపై పలువురు హిందుత్వవాదులు పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా.. శ్వేతా తివారి చేస్తున్న ‘‘షో స్టాపర్’’ వెబ్ సిరీస్ ఫ్యాషన్ రంగం చుట్టూ తిరుగుతుంది. ఆమె ఇందులో మోడల్ గా నటిస్తోంది. సౌరబ్ జైన్ ‘బ్రా’ ఫిట్టర్ పాత్రలో నటిస్తున్నాడు. గతంలో ‘మహాభారతం’ టీవీ సీరియల్ లో సౌరబ్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే శ్వేత దేవుడు (సౌరబ్) నా బ్రా సైజు కొలుస్తున్నాడు అని వ్యాఖ్యానించింది. ఆమె మాట్లాడింది దేవుడు పాత్ర పోషించిన సౌరబ్ జైన్ అనే నటుడి గురించి. అయితే అసలు విషయం పక్కకు వెళ్లి.. వ్యవహారం పోలీసులు ఇన్వాల్వ్ అయ్యే వరకు వచ్చింది. ఏం చేస్తాం రాత బాగోకపోతే అంతే.

మరోవైపు అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో శ్వేతా తివారి క్షమాపణలు చెప్పారు. తన సహచర నటుడి పాత్ర గురించి తాను చేసిన కామెంట్స్ తప్పుగా అన్వయించారని ఆమె తెలిపారు. తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని శ్వేతా తివారి పేర్కొన్నారు. తన మాటలు ఎవరినైనా నొప్పించి వుంటే క్షమించాలని ఆమె కోరారు.

More News

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ఇంట్లో విషాదం.. మనుమరాలు ఆత్మహత్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

దక్షిణాఫ్రికాలో మ‌రో డేంజ‌ర‌స్ వైర‌స్: కరోనా కొత్త రూపం 'నియోకోవ్'.. సోకితే ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు మృతి

2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న సంగతి తెలిసిందే.

సలార్‌లో శృతిహాసన్‌ క్యారెక్టర్‌కు పవన్ కుమార్తె పేరు.. పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జంటగా నటిస్తున్న తొలి సినిమా 'సలార్'. 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

అవినీతిపై యుద్ధం .. సామాజిక కోణంలో శ్రీవిష్ణు ‘‘భళా తందనాన’’ , ఆకట్టుకుంటున్న టీజర్‌

హిట్టు ఫ్లాఫ్‌తో సంబంధం లేకుండా కొత్తదనం వున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వుంటారు యువ కథానాయకుడు శ్రీవిష్ణు.

సమంత-నాగచైతన్య విడాకులపై నేనేం మాట్లాడలేదు.. అదంతా అవాస్తవం: నాగార్జున ట్వీట్

సమంత-నాగచైతన్యల విడాకులకు సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అగ్ర కథానాయకుడు నాగార్జున స్పష్టం చేశారు.