ప్రధాని పిలుపు.. రేపు 5గంటలకు దద్దరిల్లిపోవాలి!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పలు సలహాలు, సూచనలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ మేరకు మోదీ సూచనలు పాటిద్దామని..సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులు, దేశ ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించగా.. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

రేపు దద్దరిల్లిపోవాలంతే..!

‘రేపు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యశీలులకు శాల్యూట్ చేద్దాం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలి.. ఇదే మనం వారికిచ్చే గౌరవం.. ఆ చప్పట్లలో మనం వారికిచ్చే గౌరవం కనిపించాలి. ప్రధాని పిలుపును అందరూ పాటించాలి. కరోనాను తరమికొట్టేందుకు ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలి’ అని మహేశ్‌బాబు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చాడు. మహేశ్ ట్వీట్‌ను అభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. మరోవైపు లైక్‌లు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

వ‌దంతుల‌ను న‌మ్మ‌కండి..చిరు 152పై నిర్మాత‌ల వివ‌ర‌ణ‌

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ‘ఆచార్య‌’ పేరుతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ప‌తాకాల‌పై

ఈ ల్యాబ్‌ను కరోనా టెస్ట్‌లకు వాడుకోండి..: మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు మందు ఇదేనా..!?

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రయోగాలు మాత్రం ఇంకా ప్రపంచ దేశాలు చేస్తూనే ఉన్నాయి.

పోర్న్ సైట్‌లో బిగ్‌బాస్ బ్యూటీ ఫొటోలు

టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో దీన్ని పనికొచ్చే పనులకు కాకుండా.. ఏ మాత్రం ప్రయోజనం లేని పనులకు వాడే వారే ఎక్కువయ్యారు. ఎవరో ఒకర్ని టార్గెట్ చేయడం.. వారిని వేధించి సొమ్ము

మళ్లీ రిస్క్ చేస్తున్న రవితేజ ?

సాధారణంగా ఒక జోన‌ర్‌లో సినిమాలు చేసి.. అవి స‌క్సెస్ కాన‌ప్పుడు మన హీరోలు అలాంటి రిస్కులు చేయ‌డానికి ఆలోచిస్తారు. కానీ ర‌వితేజ అలాంటి ఆలోచ‌న‌లేవీ లేకుండా ఓకే చెప్పాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.