250 థియేటర్లలో 'మెట్రో' విడుదల

  • IndiaGlitz, [Thursday,March 16 2017]

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై 'ప్రేమిస్తే', 'జ‌ర్నీ', 'పిజ్జా' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా -'మెట్రో'. ర‌జ‌ని తాళ్లూరి నిర్మాత‌. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్ల‌కు, పాట‌ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. అన్ని ప‌నులు పూర్తిచేసుకున్న సినిమా మార్చి 17న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ చిత్రం 250 థియేట‌ర్ల‌ల‌లో రిలీజ్ అవుతోంది.
ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ ' మెట్రో పాట‌లు, పోస్ట‌ర్లు, ట్రైల‌ర్లకు ఏ స్థాయి రెస్పాన్స్ వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. మెట్రోకు వ‌స్తోన్న రెస్పాన్స్ చూసి ఈ చిత్రాన్ని 250 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నాం. విడుద‌ల‌కు ఒక రోజు ముందుగానే 80 శాతం థియేట‌ర్లు మొత్తం ఫుల్ అయ్యాయి. ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ర్టీని, అంద‌ర్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. గ‌తంలో నేను చేసిన సినిమాలు 30 శాతం ఫుల్ అయ్యేవి. ఈసారి ఆ శాతాన్ని దాటి అద‌నంగా 50 శాతం ఫుల్ కావ‌డం చాలా హ్యాపీగా ఉంది. మ‌ళ్లీ 'జ‌ర్నీ' లాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం ఖాయం' అని అన్నారు.
నిర్మాత ర‌జ‌ని రామ్ మాట్లాడుతూ '' భారీ అంచ‌నాల‌తో రేపు సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. వాళ్ల అంచ‌నాలకు ఏ మాత్రం త‌గ్గ‌కుండా సినిమా ఉంటుంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ , పాట‌ల‌కు వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌నిస్తుంది' అని అన్నారు.

More News

వెండితర అద్భుతం బాహుబలి: కె.రాఘవేంద్రరావు

బాలీవుడ్ సినిమాలకు ధీటుగా సత్తా చాటిన దక్షిణాది చిత్రం బాహుబలి ది బిగినింగ్.

స్పెషల్ సాంగ్ చేస్తున్న క్యాథరిన్...

అల్లుడు శీను సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా

సెన్సార్ పూర్తి చేసుకున్న 'నువ్వు నేను ఒసెయ్ ఒరెయ్'

శ్రీ మూవీ మేకర్స్ పతాకం పై రిమ్మలపూడి వీర గంగాధర్ నిర్మించిన సినిమా ‘నువ్వు నేను ఒసెయ్ ఒరెయ్’. ఈ చిత్రంతో రవిచంద్ర కన్నికంటి దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

బాహుబలి 2 ట్రైలర్ రివ్యూ...

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజెప్పిన సినిమా బాహుబలి.ఇప్పటి వరకు అపజయ మెరుగని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి

'నేనోరకం' వంటి డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే - శరత్ కుమార్

సాయిరాం శంకర్,శరత్ కుమార్,రేష్మీ మీనన్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'నేనోరకం'.సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో దీపా శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.