మార్చి 3న 'మెట్రో' విడుదల

  • IndiaGlitz, [Saturday,February 11 2017]

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై 'ప్రేమిస్తే', 'జ‌ర్నీ', 'పిజ్జా' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా -'మెట్రో'. ర‌జ‌ని తాళ్లూరి నిర్మాత‌. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ర్టాల‌లో మార్చి 3న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌ని తాళ్లూరి మాట్లాడుతూ - ''తెలుగు అనువాదం నాణ్యంగా చేశాం. సాహితి చ‌క్క‌ని మాట‌లు-పాట‌లు అందించారు. సినిమా చూస్తున్నంత సేపూ తెలుగు స్ట్రెయిట్ సినిమా చూస్తున్న‌ట్టే ఉంటుంది. గౌత‌మ్‌మీన‌న్‌, అలాగే ఏ.ఆర్‌.మురుగ‌దాస్ అంత‌టి ప్ర‌ముఖులు మా సినిమాని ప్ర‌శంసించ‌డం ఆనందాన్నిచ్చింది. మార్చి 3న సినిమా రిలీజ్ చేస్తున్నాం'' అని అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ - ''చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్ ప్ర‌శంస త‌ర్వాత ట్రైల‌ర్ చూసి ఏ.ఆర్.మురుగ‌దాస్ అభినందించ‌డం మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది. మురుగ‌దాస్ నిర్మించిన 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్‌' చిత్రాన్ని తెలుగులో 'జ‌ర్నీ' పేరుతో అందించి విజ‌యం అందుకున్నాం. ఇప్పుడు ఆయ‌న ప్ర‌శంస పొందిన 'మెట్రో' అంత‌కుమించి విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమా ఉంది. తెలుగు ఆడియెన్స్ కు ప్రామిస్సింగ్ సినిమాని అందిస్తున్నాం. మార్చి 3 సినిమా విడుద‌ల చేస్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూడ‌దగ్గ సినిమా ఇది' అని అన్నారు.

More News

నిర్మాతగా నాగశౌర్య...

ఊహలు గుసగుసలాడేతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్యకు రీసెంట్గా విడుదలైన జో అచ్యుతానంద సినిమా విమర్శకుల పరంగా మంచి ప్రశంలసు తెచ్చిపెట్టినా, కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి.

శిరీష్ తో మెలోడి బ్రహ్మ....

శ్రీరస్తు శుభ మస్తు చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న మెగా క్యాంప్ హీరో,

వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు

తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి,తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక విన్నూత్నమైన పాత్రలో కనిపించనున్నారు .

స్టీవ్ జార్డింగ్ ను కలిసిన పవన్ కల్యాణ్

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో స్పీచ్ కోసం బోస్టన్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అంతర్జాతీయ రాజకీయ వ్యూహకర్తగా పేరున్న స్టీవ్ జార్డింగ్ను కలుసుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న స్టీవ్ జార్డింగ్, పవన్ ప్రత్యేకంగా కలుసుకున్నారు.

సందీప్ కిషన్ 'నగరం' రిలీజ్ డేట్

యువ కథానాయకుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లోకేష్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో అశ్విన్కుమార్ సహదేవ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'నగరంస సైలెంట్గా విడుదలకు సిద్ధమైంంది.