అమలాపాల్పై మంత్రి ఫిర్యాదు
- IndiaGlitz, [Thursday,July 18 2019]
హీరోయిన్ అమలాపాల్పై తమిళనాడు మంత్రి ప్రియా రాజేశ్వరి చెన్నై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇంతకూ ప్రియా రాజేశ్వరి అమలాపాల్పై ఫిర్యాదు చేయడానికి కారణం 'ఆమె'(తమిళంలో అడై) చిత్రమే. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో ప్రియారాజేశ్వరి సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 'ఆమె' సినిమా కోసం అమలాపాల్ నటించిన నగ్న సన్నివేశాలు యువతపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని, పుదుచ్చేరి నుండి అమలాపాల్ రావడం వల్ల ఆమెకు తమిళ ప్రజల సంస్కృతి సంప్రదాయాలంటే గౌరవం, ప్రేమ లేదని, కేవలం ఆమె డబ్బుకోసమే ఇండస్ట్రీలోకి వచ్చారని మంత్రి ఆరోపణలు చేశారు.