close
Choose your channels

టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Friday, October 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో భూములకు రేటు పడిపోయిందని..రైతులను అడ్డుపెట్టుకుని గోతికాడ నక్కలా బతుకుతున్నారంటూ ధ్వజమెత్తారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని అడిగినందుకు బషీర్‌బాగ్‌లో.. రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబుదని విమర్శించారు.
రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమ కూడా వేసుకోవడం కాదని.. బషీర్‌బాగ్‌ ఘటనలా మీరూ కాల్చుకుంటే బాగుంటుందని కొడాలి నాని సూచించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లాంటి వేస్ట్‌ మనిషిని తాము ఎక్కడా చూడలేదన్నారు. వరి చేనుకి, చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి లోకేష్ అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. కనీస ఇంగిత జ్జానం లేని వ్యక్తి నారా లోకేష్ అని.. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని అసమర్థుడని తీవ్ర స్థాయిలో విమర్శించారు. లోకేష్‌కు ఇప్పటికే కొవ్వు కరిగిందని కళ్లు నెత్తిమీద ఉన్నాయని.. అవి కూడా కిందకు దించుతామన్నారు. కరోనా భయంతో చంద్రబాబు ఇంట్లో కూర్చున్నాడని ఎద్దేవా చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.