విశాఖలో మెట్రో.. కీలక ప్రకటన చేసిన మంత్రి


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకమైన నగరంగా పేరుతెచ్చుకున్న విశాఖపట్నంలో మెట్రో రైలు ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో భాగంగా 3 కారిడార్లలో 46.3 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటుచేస్తామని, దీనికోసం 11.498 కోట్ల రూపాయలు కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు మొదలుపెడతామన్నారు నారాయణ.
పీహెచ్పీటీటీ ఆధారంగా మెట్రో రైలుకు అనుమతులిస్తారు. పీక్ అవర్, పీక్ డైవర్షన్ ట్రాఫిక్ విధానంలో అనుమతులు మంజూరు చేస్తారు. ఇది కనీసం 10వేలు ఉండాలి. ప్రస్తుతం కొమ్మాది భోగాపురం ఎయిర్ పోర్ట్, స్ట్రీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి, ఎన్ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి మధ్య ఈ స్థాయిలో ట్రాఫిక్ లేదు. కాబట్టి అక్కడ మెట్రో రావడం కష్టమని స్పష్టం చేశారు మంత్రి.
ప్రత్యామ్నాయ మార్గాల కింద స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు తక్కువ ఖర్చుతో లైట్ రైల్ ట్రాఫిక్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే కొణాతాల విజ్ఞప్తితో మంత్రి ఏకీభవించారు. అలాగే ఎన్ఏడీ నుంచి పెందుర్తి, పాత పోస్టాఫీస్ నుంచి రుషికొండకు ట్రామ్ విధానం ఏర్పాటుచేయొచ్చని, దీనికి తక్కువ ఖర్చు అవుతుందని ఎమ్మెల్యే సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments