'మా' ఆధ్వర్యంలో ఈనెల 30న 'యాంటీ డ్రగ్' వాక్..అతిధిగా ఎక్సైజ్ మంత్రి పద్మారావు

  • IndiaGlitz, [Thursday,July 27 2017]

ఈనెల 30 తేదీన ఉదయం 7 గంటలకు కే.బి.ఆర్ పార్క్ లో 'మా' ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్) మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా 'యాంటీ డ్రగ్ వాక్' కు త‌ల‌పెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్షైజ్ శాఖ మంత్రి పద్మారావు గారిని రావాల్సిందింగా నేడు మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రెటరీ నరేష్ ఆయ‌న నివాసానికి వెళ్లి కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ,' గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలన్నది మన ప్రభుత్వ లక్ష్యమని, ప్ర‌స్తుతం సిట్ చేస్తోన్న‌ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని, సినిమా ఇండస్ట్రి లో ప్రత్యేకంగా ఎవరిపైనా కక్ష సాధింపు చేయడం లేదని, డ్రగ్ ఫ్రీ సిటి లక్ష్యంగా సినిమా పరిశ్రమ కూడా సహకరిస్తూ 'యాంటీ డ్రగ్ వాక్' కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం. అలాగే మాదక ద్రవ్యాల వాడకంను ఉక్కుపాదంతో అణిచివేసి వాటి బారిన పడుతున్న యువతియువకులను కాపాడి బంగారు తెలంగాణకు బాటలు వేస్తాం' అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో 'మా' కార్య‌వ‌ర్గ స‌భ్యుడు సురేష్ కొండేటి, తెరాస యువజన నాయకులు కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More News

జూలై 31న 'యుద్ధం శరణం' టీజర్ విడుదల

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్పై కృష్ణ ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వంలో

నాన్న, అక్కతో సినిమా చేస్తాను - అక్షర

కమల్ తనయలు శ్రుతిహాసన్,అక్షర హాసన్ ఇద్దరూ సినీ రంగంలోనే రాణిస్తున్నారు.

రొమేనియాలో 'స్పైడర్'

సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'స్పైడర్'.ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో

చిరు టైటిల్ తో తేజ్

మెగా క్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మారుతి ప్రస్తుతం శర్వానంద్తో `మహానుభావుడు` సినిమాను రూపొందిస్తున్నాడు. దీని తర్వాత సాయిధరమ్ తేజ్తో మారుతి సినిమా చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాడట.

'వివేకం' రికార్డ్

తమిళ స్టార్ అజిత్ ఇప్పుడు డైరెక్టర్ శివతో వరుసగా చేస్తున్న నాలుగో సినిమా `వివేకం`.ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.