close
Choose your channels

చిరు-నాగ్‌తో మళ్లీ భేటీ అవుతా.. ఆ తర్వాతే అన్నీ చెబుతా!

Monday, February 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరు-నాగ్‌తో మళ్లీ భేటీ అవుతా.. ఆ తర్వాతే అన్నీ చెబుతా!

టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భేటీ ముగిసింది. ఇదివరకే ఒకసారి ఈ ఇద్దరితో భేటీ అయిన ఆయన.. తాజాగా మరోసారి కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ అన్నపూర్ణ స్టూడియో వేదికైంది. సుమారు రెండు గంటలుగా సాగిన ఈ భేటీలో పలు విషయాలపై నిశితంగా చర్చించారు. మరీ ముఖ్యంగా చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఇంకా జరిగిందని తెలియవచ్చింది.

మరోసారి భేటీ.. ఆ తర్వాతే అన్నీ..!

కాగా.. భేటీ అనంతరం మీడియా ప్రతినిధులు తలసానిని పలకరించగా.. మరోసారి సమావేశం జరుగుతుందని ఆ తర్వాత మీడియా మీట్ నిర్వహించి అన్ని విషయాలు వివరంగా తెలియజేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆర్టిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లతో పాటు పలు విషయాలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అప్పట్లోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) పెద్దలు అనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజా భేటీలో చర్చకొచ్చిందా లేదా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉంటే ఈ వరుస భేటీకి సంబంధించి ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.