close
Choose your channels

దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్..

Monday, September 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే వెల్లంపల్లి సీఎం జగన్‌తో కలిసి తిరుమలలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు వెల్లంపల్లి తిరుమలలో ఉన్నారు. అలాగే సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

వారం రోజుల పాటు తిరుమలలో ఉన్న అనంతరం వెల్లంపల్లి నెల 25వ తేదీన విజయవాడకు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.